వకీల్ సాబ్ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. కానీ చెప్పుకోదగ్గ షేర్ ఏమీ రాలేదు. ఆ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. ఏపీలో కొవిడ్ సహా వేరే సమస్యలుండటంతో చాలా చోట్ల ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా థియేటర్లు మూసేస్తున్నారంటే ఈ సినిమాకు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదని, చూడాల్సిన వాళ్లందరూ చూసేశారని అర్థం చేసుకోవచ్చు. మరి అంతిమంగా ఈ సినిమా ఫలితమేంటి అంటే.. హిట్ అన్నది ట్రేడ్ వర్గాల మాట. ‘వకీల్ సాబ్’ రూ.90 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
చాలా చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. కొందరు స్వల్ప లాభాలందుకున్నారు. కొందరు స్వల్పంగా నష్టపోయారు. ఒక్క యుఎస్లో మాత్రమే ఈ చిత్రం ఫ్లాప్ అయింది. అక్కడ పెట్టుబడిని రికవర్ చేయలేకపోయింది. బ్రేక్ ఈవెన్కు చాలా దూరంలో ఆగిపోయింది. అది డిఫరెంట్ టెరిటరీ కాబట్టి దాన్ని పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో అయితే బయ్యర్లందరూ ఆల్ హ్యాపీస్ అన్నట్లే. కాకపోతో కరోనా చివర్లో దెబ్బ కొట్టి ఆదాయాన్ని కొంచెం తగ్గించింది. ఏపీలో టికెట్ల రేట్లు మునుపటిలా ఉంటే మాత్రం బయ్యర్లు, ఎగ్జిబిటర్ల పంట పండేది. ధరల మీద నియంత్రణలోనూ ఈ సినిమా చాలా బాగా పెర్ఫామ్ చేసినట్లే.
బయ్యర్లు, ఎగ్జిబిటర్ల సంగతిలా ఉంచితే.. ఈ సినిమా విషయంలో మిగతా అందరూ చాలా హ్యాపీ అన్నట్లే. పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో మంచి సక్సెస్ అందుకున్నాడు. భారీగా పారితోషకం దక్కింది. ఇక పవన్తో సినిమా తీయాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్న దిల్ రాజు, తన అభిమాన హీరోకు రీఎంట్రీలో మంచి సక్సెస్ ఇచ్చాడు. అలాగే తాను కూడా భారీగా లాభాలందుకున్నాడు. దాదాపు రూ.50 కోట్ల దాకా సినిమా మీద లాభాలు వచ్చాయట. కొంత బోనీ కపూర్కు వాటా ఇచ్చి మెజారిటీ షేర్ రాజు తీసుకోనున్నాడు. ఇక తొలిసారి ఓ పెద్ద హీరోను డైరెక్ట్ చేసి మెప్పించిన వేణు శ్రీరామ్కు ఈ సినిమా బాగా ఉపయోగపడేదే. సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన మిగతా నటీనటులకు, అలాగే టెక్నీషియన్లకు కూడా మంచి పేరొచ్చింది. ఇక చివరగా పవన్ అభిమానులు ‘వకీల్ సాబ్’ ఫలితం పట్ల, ఇందులో పవన్ను చూపించిన విధానం పట్ల పూర్తిగా సంతృప్తి చెందారు. ఆ రకంగా ‘వకీల్ సాబ్’ అందరికీ సంతోషాన్నిచ్చిన సినిమా అన్నమాట.
This post was last modified on April 23, 2021 9:04 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…