గత ఏడాది వేసవిలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సినీ ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకునే వేసవి సీజన్.. నిరుడు కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో వెలవెలబోయింది. అసలు బయటికి వెళ్లి సినిమాలు చూసే అవకాశమే లేక మూవీ గోయర్స్కు పిచ్చెక్కి పోయింది. ఏడెనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ థియేటర్లు తెరుచుకుని సినిమాలు నడవడం మొదలయ్యాక వాళ్లందరిలో ఉత్సాహం వచ్చింది. గత కొన్ని నెలల్లో తెలుగు సినిమా బాగా పుంజుకుని పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
ఇక వేసవిలో సినిమాల మోతే అని.. పతాక స్థాయి వినోదం చూడబోతున్నామని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు. అందులోనూ ‘వకీల్ సాబ్’తో సమ్మర్ సీజన్కు అదిరే ఆరంభం రావడంతో ఇక రాబోయే వారాల్లో సందడి మామూలుగా ఉండదని అనుకున్నారు. భారీ ఆశలు, అంచనాలతో వేసవి వినోదానికి సిద్ధమయ్యారు సినీ ప్రియులు.
కానీ కొన్ని రోజుల వ్యవధిలో మొత్తం మారిపోయింది. రేసులో ఉన్న ఆసక్తికర చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘వకీల్ సాబ్’ సందడి ఇంకెన్నో రోజులు కొనసాగేలా లేదు. కొత్త సినిమాలు చూస్తే పెద్దగా ఆశలు రేకెత్తించడం లేదు. గత ఏడాది ఈ సమయానికి థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి. ఇప్పుడు తెరిచి ఉండబోతున్నాయి. అంతే తేడా.
‘లవ్ స్టోరి’ లాంటి క్రేజీ మూవీ సందడి చేయాల్సిన ఈ వీకెండ్లో ఆర్జీవీ దెయ్యం, 99 సాంగ్స్ లాంటి సినిమాలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి. వీటి వంక ఎవ్వరూ చూడట్లేదు. వచ్చే వారం నాని సినిమా ‘టక్ జగదీష్’ రావాల్సింది. కానీ ఆ స్థానంలోకి ‘ఇష్క్’ అనే చిన్న సినిమా వచ్చింది. దాని మీదా ఆసక్తి అంతంతమాత్రమే. ఇక ‘విరాట పర్వం’ లాంటి పేరున్న సినిమా సందడి చేయాల్సిన వీకెండ్లో ‘ఏక్ మిని కథ’ అనే చిన్న చిత్రం రిలీజ్ కానుంది. వేసవి మీద భారీ అంచనాలతో ఉంటే.. ఇలాంటి చిత్రాలతో సర్దుకుపోవాల్సి రావడం అనూహ్యం. వేసవిలో ప్రేక్షకులు కోరుకునే సినిమాలు కావివి. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో వీటిలో సర్దుకుపోవాలి. లేదంటే సినిమాలకు టాటా చెప్పేసి ఇంట్లో కూర్చోవాలి.
This post was last modified on April 17, 2021 4:31 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…