గత ఏడాది వేసవిలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సినీ ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకునే వేసవి సీజన్.. నిరుడు కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో వెలవెలబోయింది. అసలు బయటికి వెళ్లి సినిమాలు చూసే అవకాశమే లేక మూవీ గోయర్స్కు పిచ్చెక్కి పోయింది. ఏడెనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ థియేటర్లు తెరుచుకుని సినిమాలు నడవడం మొదలయ్యాక వాళ్లందరిలో ఉత్సాహం వచ్చింది. గత కొన్ని నెలల్లో తెలుగు సినిమా బాగా పుంజుకుని పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
ఇక వేసవిలో సినిమాల మోతే అని.. పతాక స్థాయి వినోదం చూడబోతున్నామని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ప్రేక్షకులు. అందులోనూ ‘వకీల్ సాబ్’తో సమ్మర్ సీజన్కు అదిరే ఆరంభం రావడంతో ఇక రాబోయే వారాల్లో సందడి మామూలుగా ఉండదని అనుకున్నారు. భారీ ఆశలు, అంచనాలతో వేసవి వినోదానికి సిద్ధమయ్యారు సినీ ప్రియులు.
కానీ కొన్ని రోజుల వ్యవధిలో మొత్తం మారిపోయింది. రేసులో ఉన్న ఆసక్తికర చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘వకీల్ సాబ్’ సందడి ఇంకెన్నో రోజులు కొనసాగేలా లేదు. కొత్త సినిమాలు చూస్తే పెద్దగా ఆశలు రేకెత్తించడం లేదు. గత ఏడాది ఈ సమయానికి థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి. ఇప్పుడు తెరిచి ఉండబోతున్నాయి. అంతే తేడా.
‘లవ్ స్టోరి’ లాంటి క్రేజీ మూవీ సందడి చేయాల్సిన ఈ వీకెండ్లో ఆర్జీవీ దెయ్యం, 99 సాంగ్స్ లాంటి సినిమాలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి. వీటి వంక ఎవ్వరూ చూడట్లేదు. వచ్చే వారం నాని సినిమా ‘టక్ జగదీష్’ రావాల్సింది. కానీ ఆ స్థానంలోకి ‘ఇష్క్’ అనే చిన్న సినిమా వచ్చింది. దాని మీదా ఆసక్తి అంతంతమాత్రమే. ఇక ‘విరాట పర్వం’ లాంటి పేరున్న సినిమా సందడి చేయాల్సిన వీకెండ్లో ‘ఏక్ మిని కథ’ అనే చిన్న చిత్రం రిలీజ్ కానుంది. వేసవి మీద భారీ అంచనాలతో ఉంటే.. ఇలాంటి చిత్రాలతో సర్దుకుపోవాల్సి రావడం అనూహ్యం. వేసవిలో ప్రేక్షకులు కోరుకునే సినిమాలు కావివి. కానీ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో వీటిలో సర్దుకుపోవాలి. లేదంటే సినిమాలకు టాటా చెప్పేసి ఇంట్లో కూర్చోవాలి.
This post was last modified on April 17, 2021 4:31 pm
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…