Movie News

సినిమా ప్రకటించాడో లేదో వివాదం


సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడు శంకర్. సామాజికాంశాలతో ముడిపడ్డ కథలకు కమర్షియల్ టచ్ ఇస్తూ సౌత్ సినిమాను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లిన ఘనత అతడిది. ‘జెంటిల్‌మ్యాన్’తో మొదులపెట్టి.. ‘రోబో’ వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన శంకర్.. గత కొన్నేళ్లలో మాత్రం తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. పైగా ఈ మధ్య ప్రతికూల కారణాలతోనే శంకర్ వార్తల్లో నిలుస్తుండటం అభిమానులను కలవర పరుస్తోంది. ముఖ్యంగా అతడికి వరుసగా నిర్మాతలతో వివాదాలు తలెత్తుతుండటం గమనార్హం.

‘ఇండియన్-2’ సినిమాను మధ్యలో వదిలేసి వేరే సినిమాకు వెళ్లిపోయాడంటూ లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కొన్ని రోజుల కిందట అతడిపై కేసు పెట్టడం తెలిసిన సంగతే. కోర్టులో పోరాడి ఆ వివాదం నుంచి బయటపడ్డ శంకర్‌కు ఇప్పుడు మరో నిర్మాత నుంచి షాక్ తగిలింది. ఆ నిర్మాత ఎవరో కాదు.. శంకర్‌తో ‘అన్నియన్’ (అపరిచితుడు) సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఆస్కార్ రవిచంద్రన్.

తన బ్లాక్ బస్టర్ మూవీ ‘అన్నియన్’ ఆధారంగా హిందీలో రణ్వీర్ సింగ్‌తో సినిమా చేయబోతున్నట్లు శంకర్ బుధవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఎక్కడా రీమేక్ అని వాడకుండా అడాప్షన్ అని మాత్రమే శంకర్ పేర్కొన్నాడు. కాగా ఆస్కార్ రవిచంద్రన్.. తన అనుమతి లేకుండా ‘అన్నియన్’ సినిమాను ఎలా రీమేక్ చేస్తావంటూ శంకర్‌ను ప్రశ్నించాడు. ఆ సినిమా కథకు సంబంధించిన హక్కులన్నీ తన దగ్గరే ఉన్నాయని.. రచయిత సుజాత దగ్గర్నుంచి డబ్బులు చెల్లించి కథను కొన్న డాక్యుమెంట్లు కూడా చూపిస్తానని.. అలాంటిది తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ‘అన్నియన్’ హిందీ రీమేక్‌ను ఎలా ప్రకటిస్తారంటూ శంకర్‌ను నిలదీశాడు రవిచంద్రన్.

‘బాయ్స్’ సినిమాతో దెబ్బ తిన్న శంకర్‌కు అవకాశం ఇచ్చి ‘అన్నియన్’ చేయించి అతడి కెరీర్‌ను నిలబెట్టిన ఘనత తనదేనని, అలాంటిది తన అనుమతి లేకుండా ‘అన్నియన్’ రీమేక్‌ చేయడమేంటని రవిచంద్రన్ ప్రశ్నించాడు. శంకర్‌కు తన నుంచి లీగల్ నోటీసులు వెళ్లనున్నట్లు ప్రెస్ నోట్లో రవిచంద్రన్ స్పష్టం చేశాడు. మరి దీనిపై శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

This post was last modified on April 15, 2021 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

23 minutes ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

43 minutes ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

2 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

2 hours ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

2 hours ago

మాఫియా రాజ్యంలో ‘టాక్సిక్’ రక్తపాతం

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న…

3 hours ago