చిన్న పెద్ద అని తేడా లేదు. కాస్త పేరున్న ఏ సినిమా రిలీజైనా రాత్రికే కలెక్షన్ల లెక్కలు బయటికి వచ్చేస్తుంటాయి. మరుసటి రోజు అన్ని బాక్సాఫీస్ వెబ్ సైట్లూ వసూళ్ల లెక్కలు పెట్టేస్తుంటాయి. పీఆర్వోలు ట్వీట్ల ద్వారా వివరాలు ప్రకటిస్తుంటారు. ఇక పెద్ద హీరో సినిమా అంటే.. రికార్డుల మీద అందరికీ గురి ఉంటుంది కాబట్టి కలెక్షన్లు సాధ్యమైనంత త్వరగా బయటపెట్టేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతిసారీ రికార్డుల గురించి కూడా చర్చ జరుగుతుంటుంది. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందన్నదానితో సంబంధం లేకుండా ఓపెనింగ్ రికార్డులు నమోదవుతుంటాయి.
అలాంటిది ‘వకీల్ సాబ్’కు అదిరిపోయే టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధించిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడా ‘వకీల్ సాబ్’ కలెక్షన్ల లెక్కలు కనిపించడం లేదు. ఇది అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
‘వకీల్ సాబ్’ కలెక్షన్లను ఉద్దేశపూర్వకంగానే బయట పెట్టట్లేదని తెలుస్తోంది. ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ముందు రేట్లు పెంచి టికెట్లు అమ్మారు. కానీ ప్రభుత్వ అధికారులు ఎక్కడిక్కడ థియేటర్లపై దాడులు చేయడం.. రేట్లు పెంచడానికి వీల్లేదని ప్రభుత్వం జీవో జారీ చేయడం.. అమ్మిన టికెట్లకు కొందరు రీఫండ్ చేయగా.. కొందరు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం.. ఈ లోపు రేట్ల పెంపునకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. తాజాగా ప్రభుత్వం దానిపై పిటిషన్ వేయడం.. ఇలా ఏపీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ ఏపీలో ఎంత వసూళ్లు రాబట్టిందన్న విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ క్లారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం ఈ సినిమాకు వ్యతిరేకంగా నిలబడ్డ నేపథ్యంలో కలెక్షన్ల లెక్కలు చెప్పి ఎక్కడ బుక్ అవుతామో అన్న భయంలోనూ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వసూళ్ల వివరాలను బయట పెట్టట్లేదని.. దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేమని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…