ఏదైనా సినిమాలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఉంటే.. ఆ సంగీత దర్శకుడి పేరు పెట్టి ‘‘ఏం తాగి కొట్టావయ్యా’’ అంటూ వ్యాఖ్యానించడం ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండ్. కొంత కాలంగా ప్రధానంగా ఈ కామెంట్లలో వినిపిస్తున్న పేరు తమన్దే. తాజాగా ‘వకీల్ సాబ్’తో మరోసారి తమన్ ఇలాంటి కామెంట్లలో మునిగి తేలుతున్నాడు. నిన్న ఫస్ట్ షో పడ్డప్పటి నుంచి అతడి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
ఒకప్పుడు ఊకదంపుడు సంగీతంతో విమర్శలు ఎదుర్కొని, సోషల్ మీడియాలో ఎంతో ట్రోల్కు గురైన తమన్.. కొన్నేళ్ల కిందట తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని అదిరిపోయే ఆడియోలు, బ్యాగ్రౌండ్ స్కోర్లతో హవా సాగిస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ విషయానికి వస్తే.. విడుదలకు ముందే అతడి పాటలు మార్మోగిపోయాయి. మగువా మగువా, సత్యమేవ జయతే, కంటి పాప పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సినిమాలో ప్రతి పాటా సందర్భానుసారం రావడం.. వాటి టేకింగ్ కూడా బాగుండటంతో తమన్ పనితనం మరింతగా హైలైట్ అయింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా హైలైట్ కాలేదు. పవన్ ఇంట్రో సీన్ దగ్గర మొదలుపెడితే.. పతాక సన్నివేశం వరకు ఆర్ఆర్ హైలైట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ముంగిట వచ్చే ట్రైన్ ఫైట్లో.. ఆ ఫైట్ ముగిశాక పవన్ ముగ్గురమ్మాయిలతో కలిసి బయటికి నడుచుకు వచ్చే సన్నివేశంలో స్కోర్కు థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. దీని మీద వందల సంఖ్యలో మీమ్స్ వస్తున్నాయి నిన్నట్నుంచి.
తమన్కు పవన్ ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎలివేషన్ ఇస్తున్నారు. కెరీర్లోనే బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా ‘ది బెస్ట్’ ఔట్ పుట్ ఇచ్చాడంటూ అతన్ని పొగుడుతున్నారు. కథను అర్థం చేసుకుని పాటలు, నేపథ్య సంగీతం ద్వారా ఒక మూడ్ క్రియేట్ చేయడంలో తమన్ చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తమన్ కెరీర్లో ‘అరవింద సమేత’ ఈ విషయంలో ఒక ఉదాహరణగా ఉండేది. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సైతం ఆ కోవలో చేరింది.
This post was last modified on April 10, 2021 12:41 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…