ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరిగేందుకు రెడీ అవుతున్నాయా ? ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న నాయకులు త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటారా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం చీరాలలో ఎక్కడ చూసినా.. వైసీపీ నేతలే కనిపిస్తున్నారు. మంది బలం ఎక్కువగానే ఉంది. అయితే.. ఈ మంది బలమే ఇప్పుడు వైసీపీలో ఆధిపత్య పోరుకు దారి తీసింది. ప్రధానంగా.. కరణం బలరాం తన దూకుడు కారణంగా.. వైసీపీలో గ్రూపుల గోల మామూలుగా లేదనే వ్యాఖ్యలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. చీరాల వైసీపీలో ఎమ్మెల్యే కరణం, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు ఇలా చాలా మంది పేద్ద నేతలే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎప్పుడు అయితే వలస నేతలు వచ్చారో అప్పటి నుంచి ఇక్కడ వైసీపీ రాజకీయం నాశనం అయిపోయింది.
ఇక కరణం తనదే ఆధిపత్యం ఉండాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కారణంగా.. తన సొంత మనిషిగా ఇప్పటి వరకు వ్యవహరించిన మాజీ మంత్రి.. సీనియర్ నాయకుడు పాలేటి రామారావు కూడా ఇప్పుడు ఎగైనెస్ట్ అయిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీలో ఉండడం కన్నా.. బయటకు పోవడమే మంచిదని అనుకుంటున్నట్టు సమాచారం. వాస్తవానికి పాలేటి రామారావు.. వివాద రహితుడు.. మంచి పనితీరు కనబరిచే నాయకుడిగా గుర్తింపు పొందారు. వరుస విజయాలు దక్కించుకుని టీడీపీలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు.
అలాంటి నాయకుడు.. ఇప్పుడు కరణం వైఖరి కారణంగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కరణం ఎక్కడుంటే.. పాలేటి అక్కడ ఉండేవారనే కామెంట్లు వినిపించేవి. కానీ, ఇప్పుడు అదే కరణం.. పాలేటికి పొగ పెడుతున్నారు. దీంతో ఆయన విసుగు చెంది.. తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్టు చీరాల రాజకీయ వర్గాల్లో బాహాటంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీకి నాయకుల అవసరం ఎంతైనా.. ఉంది. అది కూడా పాలేటి వంటి నాయకులు వస్తే.. చంద్రబాబు నెత్తిన పెట్టుకోవడం కూడా ఖాయం.
సో.. ఇప్పుడు పాలేటి కనుక టీడీపీ వైపు వస్తే.. ఆయనకు బ్రహ్మరథం పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దిశగానే పాలేటి ఇప్పుడు ఆలోచన చేస్తున్నారని.. త్వరలోనే ఆయన టీడీపీలోకి వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే.. చీరాల రాజకీయంలో పెను మార్పులు ఖాయమని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పాలేటికి టీడీపీ టికెట్ ఇస్తే.. ఆ పోరు మరింత రసవత్తరంగా ఉంటుందని చెబుతున్నారు. సో.. మొత్తానికి చీరాల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 10, 2021 1:58 pm
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…