Political News

చీరాల‌లో కొత్త రాజ‌కీయం.. ఏంటంటే!

ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అనూహ్య‌మైన మలుపులు తిరిగేందుకు రెడీ అవుతున్నాయా ? ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఉన్న నాయ‌కులు త్వ‌ర‌లోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం చీరాల‌లో ఎక్క‌డ చూసినా.. వైసీపీ నేత‌లే క‌నిపిస్తున్నారు. మంది బ‌లం ఎక్కువ‌గానే ఉంది. అయితే.. ఈ మంది బ‌లమే ఇప్పుడు వైసీపీలో ఆధిప‌త్య పోరుకు దారి తీసింది. ప్ర‌ధానంగా.. క‌ర‌ణం బ‌ల‌రాం త‌న దూకుడు కార‌ణంగా.. వైసీపీలో గ్రూపుల గోల మామూలుగా లేద‌నే వ్యాఖ్య‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. చీరాల వైసీపీలో ఎమ్మెల్యే క‌ర‌ణం, మాజీ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత‌, మాజీ మంత్రి పాలేటి రామారావు ఇలా చాలా మంది పేద్ద నేత‌లే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎప్పుడు అయితే వ‌ల‌స నేత‌లు వ‌చ్చారో అప్ప‌టి నుంచి ఇక్క‌డ వైసీపీ రాజ‌కీయం నాశ‌నం అయిపోయింది.

ఇక క‌ర‌ణం త‌నదే ఆధిపత్యం ఉండాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కార‌ణంగా.. త‌న సొంత మ‌నిషిగా ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి.. సీనియ‌ర్ నాయ‌కుడు పాలేటి రామారావు కూడా ఇప్పుడు ఎగైనెస్ట్ అయిపోయారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వైసీపీలో ఉండ‌డం క‌న్నా.. బ‌య‌ట‌కు పోవ‌డ‌మే మంచిద‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి పాలేటి రామారావు.. వివాద ర‌హితుడు.. మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని టీడీపీలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు.

అలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు క‌రణం వైఖ‌రి కార‌ణంగా తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి క‌ర‌ణం ఎక్క‌డుంటే.. పాలేటి అక్క‌డ ఉండేవార‌నే కామెంట్లు వినిపించేవి. కానీ, ఇప్పుడు అదే క‌ర‌ణం.. పాలేటికి పొగ పెడుతున్నారు. దీంతో ఆయ‌న విసుగు చెంది.. త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు చీరాల రాజ‌కీయ వ‌ర్గాల్లో బాహాటంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం టీడీపీకి నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా.. ఉంది. అది కూడా పాలేటి వంటి నాయ‌కులు వ‌స్తే.. చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకోవ‌డం కూడా ఖాయం.

సో.. ఇప్పుడు పాలేటి క‌నుక టీడీపీ వైపు వ‌స్తే.. ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దిశ‌గానే పాలేటి ఇప్పుడు ఆలోచ‌న చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీలోకి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే జ‌రిగితే.. చీరాల రాజ‌కీయంలో పెను మార్పులు ఖాయ‌మ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పాలేటికి టీడీపీ టికెట్ ఇస్తే.. ఆ పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. సో.. మొత్తానికి చీరాల రాజ‌కీయం అనూహ్య మ‌లుపులు తిరుగుతోంద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

6 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

40 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

4 hours ago