Political News

చీరాల‌లో కొత్త రాజ‌కీయం.. ఏంటంటే!

ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు అనూహ్య‌మైన మలుపులు తిరిగేందుకు రెడీ అవుతున్నాయా ? ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ ఉన్న నాయ‌కులు త్వ‌ర‌లోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం చీరాల‌లో ఎక్క‌డ చూసినా.. వైసీపీ నేత‌లే క‌నిపిస్తున్నారు. మంది బ‌లం ఎక్కువ‌గానే ఉంది. అయితే.. ఈ మంది బ‌లమే ఇప్పుడు వైసీపీలో ఆధిప‌త్య పోరుకు దారి తీసింది. ప్ర‌ధానంగా.. క‌ర‌ణం బ‌ల‌రాం త‌న దూకుడు కార‌ణంగా.. వైసీపీలో గ్రూపుల గోల మామూలుగా లేద‌నే వ్యాఖ్య‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. చీరాల వైసీపీలో ఎమ్మెల్యే క‌ర‌ణం, మాజీ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత‌, మాజీ మంత్రి పాలేటి రామారావు ఇలా చాలా మంది పేద్ద నేత‌లే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎప్పుడు అయితే వ‌ల‌స నేత‌లు వ‌చ్చారో అప్ప‌టి నుంచి ఇక్క‌డ వైసీపీ రాజ‌కీయం నాశ‌నం అయిపోయింది.

ఇక క‌ర‌ణం త‌నదే ఆధిపత్యం ఉండాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కార‌ణంగా.. త‌న సొంత మ‌నిషిగా ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌హ‌రించిన మాజీ మంత్రి.. సీనియ‌ర్ నాయ‌కుడు పాలేటి రామారావు కూడా ఇప్పుడు ఎగైనెస్ట్ అయిపోయారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వైసీపీలో ఉండ‌డం క‌న్నా.. బ‌య‌ట‌కు పోవ‌డ‌మే మంచిద‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి పాలేటి రామారావు.. వివాద ర‌హితుడు.. మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని టీడీపీలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు.

అలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు క‌రణం వైఖ‌రి కార‌ణంగా తీవ్ర అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వానికి క‌ర‌ణం ఎక్క‌డుంటే.. పాలేటి అక్క‌డ ఉండేవార‌నే కామెంట్లు వినిపించేవి. కానీ, ఇప్పుడు అదే క‌ర‌ణం.. పాలేటికి పొగ పెడుతున్నారు. దీంతో ఆయ‌న విసుగు చెంది.. త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు చీరాల రాజ‌కీయ వ‌ర్గాల్లో బాహాటంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం టీడీపీకి నాయ‌కుల అవ‌స‌రం ఎంతైనా.. ఉంది. అది కూడా పాలేటి వంటి నాయ‌కులు వ‌స్తే.. చంద్ర‌బాబు నెత్తిన పెట్టుకోవ‌డం కూడా ఖాయం.

సో.. ఇప్పుడు పాలేటి క‌నుక టీడీపీ వైపు వ‌స్తే.. ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దిశ‌గానే పాలేటి ఇప్పుడు ఆలోచ‌న చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీలోకి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే జ‌రిగితే.. చీరాల రాజ‌కీయంలో పెను మార్పులు ఖాయ‌మ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పాలేటికి టీడీపీ టికెట్ ఇస్తే.. ఆ పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. సో.. మొత్తానికి చీరాల రాజ‌కీయం అనూహ్య మ‌లుపులు తిరుగుతోంద‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 10, 2021 1:58 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

7 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

8 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

9 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

9 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

11 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

14 hours ago