రామ్ చరణ్-శంకర్ల క్రేజీ కాంబినేషన్లో అతి త్వరలోనే సినిమా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’తో మరో స్థాయికి వెళ్లబోతున్న రామ్ చరణ్.. ఆ తర్వాత వెంటనే శంకర్ లాంటి అగ్రశ్రేణి దర్శకుడితో సినిమా చేయబోతుండటంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. శంకర్ తన స్థాయికి తగ్గ సినిమా తీస్తే ఈ సినిమా మెగా సక్సెస్ కావడం ఖాయం.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ భారీగా ఉండేలా చూసుకుంటోంది చిత్ర బృందం. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ సినిమాకు కథానాయికగా ఎంపికైనట్లు.. తనతో పాటు ఓ కొరియన్ బ్యూటీ కూడా ఇందులో నటించబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉన్నట్లు కూడా ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఆ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించే అవకాశాలున్నాయంటూ క్రేజీ రూమర్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
సల్మాన్తో రామ్ చరణ్కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ బాలీవుడ్ మూవీ ‘జంజీర్’లో నటించేటపుడు ముంబయిలో ప్రతి రోజూ అతడికి సల్మాన్ ఇంటి నుంచే క్యారియర్ వెళ్లింది. సల్మాన్ హైదరాబాద్లో షూటింగ్కు వచ్చినా చిరు ఇంటి నుంచి క్యారియర్ వెళ్తుంటుంది. చరణ్ తరచుగా సల్మాన్ను కలుస్తుంటాడు కూడా. ఈ అనుబంధంతోనే సల్మాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్పాయో’ తెలుగు వెర్షన్లో సల్మాన్ పాత్రకు చరణే డబ్బింగ్ చెప్పాడు.
ఇప్పుడు చరణ్ కోసం శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తీయబోయే పాన్ ఇండియా సినిమాలో అతిథి పాత్ర చేయమంటే సల్మాన్ కాదంటాడని అనుకోలేం. కాబట్టి ఈ సినిమాలో సల్మాన్ నటించే అవకాశాలే ఎక్కువ. నిజంగా అదే జరిగితే ఈ చిత్రానికి ఉత్తరాదిన బంపర్ క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్కు కూడా నార్త్లో పాపులారిటీ పెరుగుతుంది కాబట్టి అతడికి సల్మాన్ తోడైతే ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో జరిగే అవకాశముంది. ఈ చిత్రాన్ని జులైలో సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 9, 2021 7:43 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…