రామ్ చరణ్-శంకర్ల క్రేజీ కాంబినేషన్లో అతి త్వరలోనే సినిమా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’తో మరో స్థాయికి వెళ్లబోతున్న రామ్ చరణ్.. ఆ తర్వాత వెంటనే శంకర్ లాంటి అగ్రశ్రేణి దర్శకుడితో సినిమా చేయబోతుండటంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. శంకర్ తన స్థాయికి తగ్గ సినిమా తీస్తే ఈ సినిమా మెగా సక్సెస్ కావడం ఖాయం.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ భారీగా ఉండేలా చూసుకుంటోంది చిత్ర బృందం. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ సినిమాకు కథానాయికగా ఎంపికైనట్లు.. తనతో పాటు ఓ కొరియన్ బ్యూటీ కూడా ఇందులో నటించబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉన్నట్లు కూడా ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఆ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించే అవకాశాలున్నాయంటూ క్రేజీ రూమర్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
సల్మాన్తో రామ్ చరణ్కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ బాలీవుడ్ మూవీ ‘జంజీర్’లో నటించేటపుడు ముంబయిలో ప్రతి రోజూ అతడికి సల్మాన్ ఇంటి నుంచే క్యారియర్ వెళ్లింది. సల్మాన్ హైదరాబాద్లో షూటింగ్కు వచ్చినా చిరు ఇంటి నుంచి క్యారియర్ వెళ్తుంటుంది. చరణ్ తరచుగా సల్మాన్ను కలుస్తుంటాడు కూడా. ఈ అనుబంధంతోనే సల్మాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్పాయో’ తెలుగు వెర్షన్లో సల్మాన్ పాత్రకు చరణే డబ్బింగ్ చెప్పాడు.
ఇప్పుడు చరణ్ కోసం శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తీయబోయే పాన్ ఇండియా సినిమాలో అతిథి పాత్ర చేయమంటే సల్మాన్ కాదంటాడని అనుకోలేం. కాబట్టి ఈ సినిమాలో సల్మాన్ నటించే అవకాశాలే ఎక్కువ. నిజంగా అదే జరిగితే ఈ చిత్రానికి ఉత్తరాదిన బంపర్ క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్కు కూడా నార్త్లో పాపులారిటీ పెరుగుతుంది కాబట్టి అతడికి సల్మాన్ తోడైతే ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో జరిగే అవకాశముంది. ఈ చిత్రాన్ని జులైలో సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 9, 2021 7:43 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…