Dil Raju
హిందీలో కొన్నేళ్ల కిందట మంచి విజయం సాధించిన సినిమా పింక్. ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ మూవీ. కథ మొత్తం ముగ్గురు మహిళల చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక పాత్రలో తాప్సి నటించింది. అమితాబ్ బచ్చన్ దాదాపు గెస్ట్ రోల్ లాంటిది చేశారిందులో. ఈ సినిమాను తమిళంలో నీర్కొండ పార్వై పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్లో అమితాబ్ చేసిన పాత్రను ఇక్కడ అజిత్ చేయగా.. తాప్సి క్యారెక్టర్లో శ్రద్ధ శ్రీనాథ్ కనిపించింది. తమిళంలో అజిత్ నటించడంతో కొంచెం హీరోయిజం జోడించారు. పాత్రను పెంచారు. అక్కడా ఈ సినిమా మంచి విజయమే సాధించింది.
ఇప్పుడీ చిత్రం తెలుగులో వకీల్ సాబ్గా వస్తోంది. ఇక్కడ హీరోయిజం, పవన్ పాత్రను మరింత పెంచారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా తీర్చిదిద్దారు. ఐతే పింక్ను చెడగొట్టారనే అనేవాళ్లూ లేకపోలేదు. దీనికి నిర్మాత దిల్ రాజు సమాధానం చెప్పారు.
వకీల్ సాబ్ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో మీడియాను కలిసిన దిల్ రాజు.. పింక్ కన్నా, నీర్కొండ పార్వై కన్నా వకీల్ సాబ్ బాగుంటుందని ధీమాగా చెప్పారు. పింక్కు 50 మార్కులు పడితే.. నీర్కొండ పార్వై 75 మార్కులు దక్కించుకుంటుందని.. వకీల్ సాబ్కు అయితే ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారని దిల్ రాజు పేర్కొన్నారు. హిందీ, తమిళ వెర్షన్లతో పోలిస్తే తెలుగు వెర్షన్ ఇంకా మెరుగ్గా తయారైందని రాజు చెప్పారు.
అసలు కథ చెడకుండానే.. పవన్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని సినిమాను ఎంతో జాగ్రత్తగా తీశామని దిల్ రాజు అన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 15వ నిమిషంలో స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తాడని.. ఇక అక్కడి నుంచి థియేటర్లు మోతెక్కిపోతాయని రాజు చెప్పారు. మార్నింగ్ షో పడగానే వకీల్ సాబ్ లెవెలే మారిపోతుందని రాజు ధీమా వ్యక్తం చేయడం విశేషం.
This post was last modified on April 7, 2021 10:51 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…