దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ కెరీర్ మొదట్లో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఒక అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. అయితే రోబో అనంతరం అతని జడ్జిమెంట్ తేడా కొట్టేస్తోంది. దరిద్రమో లేక ధీమాక్ లో పస తగ్గిందో ఏమో గాని అనేక రకాల ఇబ్బందులను ఏదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు లైకా దెబ్బకు రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమాకు బ్రేకులు పడేలా ఉన్నాయి. ఇండియన్ 2 నిర్మాతలు కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్ లో చేసిన 2.ఓ కోసం 500కోట్ల వరకు ఖర్చు చేయించిన శంకర్ ఊహించని రిజల్ట్ ను అందుకున్నాడు. ఇక కమిట్మెంట్ ప్రకారం 2.ఓ నష్టాలను పూరించాలని ఇండియన్ 2ను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. 300కోట్లతో అనుకున్న ఆ సినిమా బడ్జెట్ శంకర్ ప్లాప్స్ కారణంగా లైకా వాళ్ళు 230కు తెగ్గొట్టారు. మధ్యలో కమల్ ఆలస్యం, యాక్సిడెంట్, కోవిడ్ వంటి ఘటనలతో సినిమా మరింత ఆలస్యం అయ్యింది.
ఇక లాక్ డౌన్ తరువాత అయినా సినిమాను స్టార్ట్ చేస్తారని అనుకుంటే లైకా ప్రొడక్షన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రెమ్యునరేషన్ విషయంలో హార్ట్ అయినట్లు టాక్ వచ్చింది. దీంతో శంకర్ రామ్ చరణ్ తో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు లైకా హై కోర్టుకు వెళ్లింది. 230కోట్ల బడ్జెట్ లో ఇప్పటికే 180కోట్ల వరకు ఖర్చు చేసిన శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయకుండా మరో సినిమా స్టార్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మిగతా రెమ్యునరేషన్ ను చెల్లిస్తామని వెంటనే అతని తదుపరి సినిమాలను ఆపేసి ఇండియన్ 2ను పూర్తి చేయాలని కేసు వేశారు. దీంతో న్యాయస్థానం శంకర్ సమాధానం కోసం నోటీసులు పంపింది. మరి శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on April 1, 2021 1:43 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…