దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ కెరీర్ మొదట్లో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఒక అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. అయితే రోబో అనంతరం అతని జడ్జిమెంట్ తేడా కొట్టేస్తోంది. దరిద్రమో లేక ధీమాక్ లో పస తగ్గిందో ఏమో గాని అనేక రకాల ఇబ్బందులను ఏదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు లైకా దెబ్బకు రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమాకు బ్రేకులు పడేలా ఉన్నాయి. ఇండియన్ 2 నిర్మాతలు కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్ లో చేసిన 2.ఓ కోసం 500కోట్ల వరకు ఖర్చు చేయించిన శంకర్ ఊహించని రిజల్ట్ ను అందుకున్నాడు. ఇక కమిట్మెంట్ ప్రకారం 2.ఓ నష్టాలను పూరించాలని ఇండియన్ 2ను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. 300కోట్లతో అనుకున్న ఆ సినిమా బడ్జెట్ శంకర్ ప్లాప్స్ కారణంగా లైకా వాళ్ళు 230కు తెగ్గొట్టారు. మధ్యలో కమల్ ఆలస్యం, యాక్సిడెంట్, కోవిడ్ వంటి ఘటనలతో సినిమా మరింత ఆలస్యం అయ్యింది.
ఇక లాక్ డౌన్ తరువాత అయినా సినిమాను స్టార్ట్ చేస్తారని అనుకుంటే లైకా ప్రొడక్షన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రెమ్యునరేషన్ విషయంలో హార్ట్ అయినట్లు టాక్ వచ్చింది. దీంతో శంకర్ రామ్ చరణ్ తో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు లైకా హై కోర్టుకు వెళ్లింది. 230కోట్ల బడ్జెట్ లో ఇప్పటికే 180కోట్ల వరకు ఖర్చు చేసిన శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయకుండా మరో సినిమా స్టార్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మిగతా రెమ్యునరేషన్ ను చెల్లిస్తామని వెంటనే అతని తదుపరి సినిమాలను ఆపేసి ఇండియన్ 2ను పూర్తి చేయాలని కేసు వేశారు. దీంతో న్యాయస్థానం శంకర్ సమాధానం కోసం నోటీసులు పంపింది. మరి శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…