ట్విట్టర్లో హీరోల పుట్టిన రోజులప్పుడు, వాళ్ల సినిమాలకు సంబంధించిన విశేషాలు రిలీజైనపుడు.. లేదంటే పాత సినిమాల వార్షికోత్సవాల్ని పురస్కరించుకుని అభిమానులు ఎంత హంగామా చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా స్పెషల్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వాటి మీద ఇన్ని మిలియన్స్ అని టార్గెట్ పెట్టుకుని ట్వీట్లు వేస్తున్నారు.
ఐతే అభిమానులు తమకు తాముగా ఉత్సాహంతో ట్వీట్లు వేస్తే ఓకే. కానీ కలెక్షన్ల తరహాలో ఈ రికార్డుల్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బోట్స్ ద్వారా ఫేక్ అకౌంట్లు తయారు చేయించి ట్వీట్లు వేయించే సంస్కృతి ఈ మధ్య టాలీవుడ్లో ఊపందుకుంటోంది.
కొందరు హీరోల పీఆర్వోలు డబ్బులు ఖర్చు పెట్టి ఈ వ్యవహారాల్ని నడిపిస్తున్న వైనం ట్విట్టర్లో ట్రెండ్స్ను బట్టి స్పష్టంగా తెలిసిపోతోంది. ఇలాంటి సమయంలో పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ రికార్డులకు పాతరేసే పనిలో పడ్డారు.
పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఎంత దూరంగా ఉంటాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్ ట్విట్టర్లో ఉన్నాడు కానీ.. తన సినిమాల గురించి ఒక్క మాట మాట్లాడడు. అభిమానులతో సినిమాల పరంగా కనెక్ట్ కాడు. పవన్ కోసం సినిమా పీఆర్వోలు పని చేయడం, ఫేక్ రికార్డుల కోసం వెంపర్లాడటం ఉండదు. పవన్కు సంబంధించి ఏ హ్యాష్ ట్యాగ్ వచ్చినా.. ట్విట్టర్లో సందడి కనిపించినా.. అది నిజమైన అభిమానంతో చేసేదే.
పవన్ కెరీర్లో మెమొరబుల్ ఫిలిం అయిన గబ్బర్ సింగ్కు సోమవారంతో ఎనిమిదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ 8yearsforgabbarsinghhystiria పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి రచ్చ మొదలుపెట్టారు. ఆదివారం రాత్రికే దీని మీద 3 మిలియన్ల ట్వీట్లు పడ్డాయి. టార్గెట్ 10 మిలియన్లు పెట్టుకున్నారు. రేపు రాత్రికి ఆ టార్గెట్ రీచ్ కావడం కష్టం కాకపోవచ్చు. ఫేక్ అనే మాటకు తావు లేకుండా ఈ లక్ష్యాన్ని అందుకుని ట్విట్టర్కు రియల్ పవర్ చూపించాలన్నది పవన్ ఫ్యాన్స్ ప్రయత్నం.
This post was last modified on May 11, 2020 10:23 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…