పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా పింక్ రీమేక్ను ఎంచుకోవడం అతడి అభిమానులకు అస్సలు నచ్చలేదు. పైగా ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ అనేసరికి వాళ్లలో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. దీనికి ముందు వేణు ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. ఓ మై ఫ్రెండ్ లాంటి ఫ్లాప్ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రవితేజతో ఓ సినిమా మొదలుపెడితే.. అది ముందుకే సాగలేదు. చాలా గ్యాప్ తర్వాత తీసిన ఎంసీఏతో హిట్టయితే కొట్టాడు కానీ.. అది రొటీన్ మూవీ అనే విమర్శలు వచ్చాయి.
ఇలాంటి దర్శకుడితో పవన్ సినిమా చేయడమేంటి అన్నది అప్పుడు పవన్ అభిమానుల అభ్యంతరం. కానీ ఇప్పుడు అదే పవన్ ఫ్యాన్స్ వేణు మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. వేణు శ్రీరామ్.. ది మాస్ గాడ్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు వేణును వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటుండం విశేషం.
పింక్ లాంటి సబ్జెక్టును తీసుకుని.. పవన్ కళ్యాణ్ ఇమేజ్కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కలర్ తీసుకురావడం పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. టీజర్, ఆ తర్వాత రిలీజ్ చేసిన ప్రోమోల్లో పవన్ను చూసి అభిమానులు మురిసిపోయారు.ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే పవన్ బెస్ట్ లుక్లో కనిపించాడిందులో. అలాగే పవన్ మేనరిజమ్స్, హావభావాలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి అభిమానులను.
ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో పవన్ అభిమానులు మెచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయడం.. అదే సమయంలో ఒరిజినల్ చెడకుండా చూసుకోవడం తేలికైన విషయం కాదు. ఈ బ్యాలెన్స్ అందరికీ నచ్చుతోంది. పవన్ అభిమానులైతే ఇప్పుడు వేణును తెగ పొగిడేస్తున్నారు. పవన్కు మంచి రీఎంట్రీ మూవీ ఇస్తున్నాడంటూ అతణ్ని కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే మాస్ గాడ్ వేణు శ్రీరామ్ అంటూ హ్యాష్ ట్యాగ్లు పెడుతుండటం విశేషం.
This post was last modified on March 31, 2021 7:34 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…