యువ కథానాయకుడు విశ్వక్సేన్ స్థాయిని పెంచిన సినిమా ‘హిట్’. అతడి కెరీర్లో తొలి సూపర్ హిట్ మూవీ కూడా ఇదే. అంతకుముందు అతను చేసిన వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్ సినిమాలు కమర్షియల్గా ఆశించినంత మంచి ఫలితాలు అందుకోలేదు. ‘హిట్’ మాత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గరా మంచి విజయం సాధించింది.
ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు దర్శకుడు శైలేష్ కొలను ప్రకటించగానే.. విశ్వక్నే హీరోగా ఊహించుకున్నారు అందరూ. ఇలాంటి ఫ్రాంఛైజీని విశ్వక్ ఎందుకు వదులుకుంటాడనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కానీ ఆశ్చర్యకరంగా అతను ‘హిట్-2’కు దూరమయ్యాడు. అతడి స్థానంలోకి థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టు అడివి శేష్ వచ్చాడు. దీని వల్ల సినిమాకు ఇంకా హైప్ వచ్చింది కానీ.. విశ్వక్ ఎందుకు ఈ ప్రాజెక్టుకు దూరమయ్యాడన్నదే ప్రశ్నగా మారింది.
విశ్వక్ వద్దనుకుని శేష్ను ఈ ప్రాజెక్టులోకి తీసుకుని ఉంటారనే ప్రచారం జరిగింది. ఐతే తనను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించలేదని, డేట్లు సర్దుబాటు చేయలేక తానే తప్పుకున్నానని విశ్వక్సేన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను వరుసగా సినిమాలు కమిటై ఉన్నానని, వాటి మధ్య ‘హిట్-2’కు కాల్ షీట్లు ఇవ్వలేకే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విశ్వక్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘పాగల్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న విశ్వక్సేన్.. దీంతో పాటు ‘ప్రాజెక్ట్ గామి’ అనే సినిమాలోనూ నటించాడు.
త్వరలోనే అతను తమిళ హిట్ ‘ఓ మై కడవులే’ రీమేక్ను మొదలు పెట్టబోతున్నాడు. మరో కొత్త దర్శకుడి తోనూ ఓ కమిట్మెంట్ ఉందట. ఇన్ని సినిమాల మధ్య ‘హిట్-2’ చేయలేకపోయానని అతను వెల్లడించాడు. ‘పాగల్’ మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 29, 2021 9:27 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…