యువ కథానాయకుడు కార్తికేయకు అరంగేట్ర సినిమా ‘ఆర్ఎక్స్ 100’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ముందు అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేశాడు. ఆ పేరుతో ఓ సినిమా రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఐతే రెండో సినిమాగా చేసిన ‘ఆర్ఎక్స్ 100’ సంచలన విజయం సాధించడంతో అతను ఓవర్ నైట్ మంచి పాపులారిటీ సంపాదించాడు. చిన్న స్థాయి స్టార్ అయ్యాడు. అవకాశాలు వరుస కట్టేశాయి. ఐతే వీటిలో సరైనవి ఎంచుకోవడంలో కార్తికేయ తడబడ్డాడు. దెబ్బకు అరడజను ఫ్లాపులు అతడి ఖాతాలో పడ్డాయి.
తాజాగా ‘చావు కబురు చల్లగా’ కార్తికేయ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రం అయింది. గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న బేనర్లో సినిమా అంటే.. కార్తికేయ హిట్టు కొట్టబోతున్నట్లే అని అంతా ధీమాగా ఉన్నారు కానీ.. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
‘చావు కబురు చల్లగా’ తన కెరీర్కు పెద్ద దెబ్బ అయ్యేలా ఉందని కార్తికేయ కూడా అర్థం చేసుకున్నట్లున్నాడు. ప్రేక్షకులు తనపై ఆగ్రహం చూపించకుండా వాళ్లను మన్నించమని కోరుతూ ఒక ట్వీట్ వేశాడు. ముందుగా ఈ సినిమా నటుడిగా తనలో కొత్త కోణాన్ని బటయటికి తీసిందని, కొందరు ప్రేక్షకుల మనసుకు ఇది బాగా చేరువ అయిందని.. బస్తీ బాలరాజు పాత్ర చేసినందుకు తాను గర్విస్తున్నానని అతను పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించాలని.. తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరాడు.
కచ్చితంగా తన తప్పులను సరిదిద్దుకుని పుంజుకునే ప్రయత్నం చేస్తానని అతనన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకుల మీద తమ అసహనాన్ని చూపించేవాళ్లూ ఉంటారు. దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఫెయిల్యూర్ను అంగీకరించి ప్రేక్షకుల నుంచి మన్నింపు కోరితే వారిలో సానుభూతి, సానుకూలత కనిపిస్తాయి. కార్తికేయ తెలివిగా ఆ పనే చేశాడు.
This post was last modified on March 29, 2021 5:16 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…