యువ కథానాయకుడు కార్తికేయకు అరంగేట్ర సినిమా ‘ఆర్ఎక్స్ 100’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ముందు అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేశాడు. ఆ పేరుతో ఓ సినిమా రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఐతే రెండో సినిమాగా చేసిన ‘ఆర్ఎక్స్ 100’ సంచలన విజయం సాధించడంతో అతను ఓవర్ నైట్ మంచి పాపులారిటీ సంపాదించాడు. చిన్న స్థాయి స్టార్ అయ్యాడు. అవకాశాలు వరుస కట్టేశాయి. ఐతే వీటిలో సరైనవి ఎంచుకోవడంలో కార్తికేయ తడబడ్డాడు. దెబ్బకు అరడజను ఫ్లాపులు అతడి ఖాతాలో పడ్డాయి.
తాజాగా ‘చావు కబురు చల్లగా’ కార్తికేయ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రం అయింది. గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న బేనర్లో సినిమా అంటే.. కార్తికేయ హిట్టు కొట్టబోతున్నట్లే అని అంతా ధీమాగా ఉన్నారు కానీ.. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
‘చావు కబురు చల్లగా’ తన కెరీర్కు పెద్ద దెబ్బ అయ్యేలా ఉందని కార్తికేయ కూడా అర్థం చేసుకున్నట్లున్నాడు. ప్రేక్షకులు తనపై ఆగ్రహం చూపించకుండా వాళ్లను మన్నించమని కోరుతూ ఒక ట్వీట్ వేశాడు. ముందుగా ఈ సినిమా నటుడిగా తనలో కొత్త కోణాన్ని బటయటికి తీసిందని, కొందరు ప్రేక్షకుల మనసుకు ఇది బాగా చేరువ అయిందని.. బస్తీ బాలరాజు పాత్ర చేసినందుకు తాను గర్విస్తున్నానని అతను పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించాలని.. తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరాడు.
కచ్చితంగా తన తప్పులను సరిదిద్దుకుని పుంజుకునే ప్రయత్నం చేస్తానని అతనన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకుల మీద తమ అసహనాన్ని చూపించేవాళ్లూ ఉంటారు. దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఫెయిల్యూర్ను అంగీకరించి ప్రేక్షకుల నుంచి మన్నింపు కోరితే వారిలో సానుభూతి, సానుకూలత కనిపిస్తాయి. కార్తికేయ తెలివిగా ఆ పనే చేశాడు.
This post was last modified on March 29, 2021 5:16 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…