యువ కథానాయకుడు కార్తికేయకు అరంగేట్ర సినిమా ‘ఆర్ఎక్స్ 100’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ముందు అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేశాడు. ఆ పేరుతో ఓ సినిమా రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఐతే రెండో సినిమాగా చేసిన ‘ఆర్ఎక్స్ 100’ సంచలన విజయం సాధించడంతో అతను ఓవర్ నైట్ మంచి పాపులారిటీ సంపాదించాడు. చిన్న స్థాయి స్టార్ అయ్యాడు. అవకాశాలు వరుస కట్టేశాయి. ఐతే వీటిలో సరైనవి ఎంచుకోవడంలో కార్తికేయ తడబడ్డాడు. దెబ్బకు అరడజను ఫ్లాపులు అతడి ఖాతాలో పడ్డాయి.
తాజాగా ‘చావు కబురు చల్లగా’ కార్తికేయ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రం అయింది. గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న బేనర్లో సినిమా అంటే.. కార్తికేయ హిట్టు కొట్టబోతున్నట్లే అని అంతా ధీమాగా ఉన్నారు కానీ.. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
‘చావు కబురు చల్లగా’ తన కెరీర్కు పెద్ద దెబ్బ అయ్యేలా ఉందని కార్తికేయ కూడా అర్థం చేసుకున్నట్లున్నాడు. ప్రేక్షకులు తనపై ఆగ్రహం చూపించకుండా వాళ్లను మన్నించమని కోరుతూ ఒక ట్వీట్ వేశాడు. ముందుగా ఈ సినిమా నటుడిగా తనలో కొత్త కోణాన్ని బటయటికి తీసిందని, కొందరు ప్రేక్షకుల మనసుకు ఇది బాగా చేరువ అయిందని.. బస్తీ బాలరాజు పాత్ర చేసినందుకు తాను గర్విస్తున్నానని అతను పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించాలని.. తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరాడు.
కచ్చితంగా తన తప్పులను సరిదిద్దుకుని పుంజుకునే ప్రయత్నం చేస్తానని అతనన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకుల మీద తమ అసహనాన్ని చూపించేవాళ్లూ ఉంటారు. దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఫెయిల్యూర్ను అంగీకరించి ప్రేక్షకుల నుంచి మన్నింపు కోరితే వారిలో సానుభూతి, సానుకూలత కనిపిస్తాయి. కార్తికేయ తెలివిగా ఆ పనే చేశాడు.
This post was last modified on March 29, 2021 5:16 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…