‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే తొలి చిత్రం తమ హీరోతోనే అని చాలా ఆనందపడిపోయారు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. తారక్-ప్రశాంత్ కలయికలో సినిమాకు రంగం సిద్ధం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అప్పట్లో.. ఈ సినిమా గురించి అప్ డేట్ సైతం ఇచ్చింది.
కానీ ఊహించని విధంగా ప్రభాస్తో ‘సలార్’ మొదలుపెట్టేశాడు ప్రశాంత్. దీంతో తారక్తో అతడి సినిమా సంగతేంటని అభిమానులు టెన్షన్ పడిపోయారు. వారి ఆందోళనను తీర్చేస్తూ.. ఇటీవల ‘ఉప్పెన’ ప్రమోషన్ల సందర్భంగా తారక్-ప్రశాంత్ సినిమా తప్పక ఉంటుందని తేల్చారు మైత్రీ అధినేతలు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టుపై సందేహాలు రేకెత్తించే పరిణామం జరిగింది.
ప్రశాంత్ నీల్ మంగళవారం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు రావడం.. బన్నీతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది అనుకోకుండా జరిగిన పరిణామంలా లేదు. బన్నీతో సినిమా కోసమే కలిసినట్లు తెలుస్తోంది.
బన్నీ సినిమాల ప్లానింగ్ మామూలుగా ఉండదు. దర్శకుల ఎంపికలో పక్కాగా వ్యవహరిస్తుంటాడు. మిగతా హీరోల ఎదుగుదలను జాగ్రత్తగా గమనిస్తుంటాడు. ఎవరికీ తీసిపోని విధంగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటాడు. వరుసగా త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులతో అతను లైనప్ సెట్ చేసుకున్నాడు. ఐతే పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే వీళ్లెవ్వరితోనూ పని కాదు. రాజమౌళినో, ప్రశాంత్ నీల్నో ఎంచుకోవాల్సింది. రాజమౌళితో ఇప్పుడిప్పుడే వర్కవుటయ్యేలా లేదు. కాబట్టి ప్రశాంత్ మీద అతడి కళ్లు పడ్డట్లున్నాయి. అందుకే తమ కలయికలో సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉంది.
ఐతే ఎన్టీఆర్తో చేశాక బన్నీతో ప్రశాంత్ సినిమా చేస్తే.. నందమూరి అభిమానులకు అభ్యంతరం లేదు. కానీ అనుకోకుండా వచ్చి పడ్డ ‘సలార్’ లాగే.. తారక్ ప్రాజెక్టును వెనక్కి నెట్టే బన్నీతో వేరే సినిమా చేస్తాడేమో అని ప్రశాంత్ మీద వారికి అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసి, త్రివిక్రమ్ సినిమాను ముగించేసరికి తారక్కు ఆలస్యం కావచ్చు. ఈ మధ్యలో ఖాళీ దొరికితే బన్నీ-ప్రశాంత్ సినిమా ఏమైనా సెట్ అయిపోతుందేమో అన్నది వారి భయం.
This post was last modified on March 10, 2021 2:05 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…