‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే తొలి చిత్రం తమ హీరోతోనే అని చాలా ఆనందపడిపోయారు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. తారక్-ప్రశాంత్ కలయికలో సినిమాకు రంగం సిద్ధం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అప్పట్లో.. ఈ సినిమా గురించి అప్ డేట్ సైతం ఇచ్చింది.
కానీ ఊహించని విధంగా ప్రభాస్తో ‘సలార్’ మొదలుపెట్టేశాడు ప్రశాంత్. దీంతో తారక్తో అతడి సినిమా సంగతేంటని అభిమానులు టెన్షన్ పడిపోయారు. వారి ఆందోళనను తీర్చేస్తూ.. ఇటీవల ‘ఉప్పెన’ ప్రమోషన్ల సందర్భంగా తారక్-ప్రశాంత్ సినిమా తప్పక ఉంటుందని తేల్చారు మైత్రీ అధినేతలు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టుపై సందేహాలు రేకెత్తించే పరిణామం జరిగింది.
ప్రశాంత్ నీల్ మంగళవారం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు రావడం.. బన్నీతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది అనుకోకుండా జరిగిన పరిణామంలా లేదు. బన్నీతో సినిమా కోసమే కలిసినట్లు తెలుస్తోంది.
బన్నీ సినిమాల ప్లానింగ్ మామూలుగా ఉండదు. దర్శకుల ఎంపికలో పక్కాగా వ్యవహరిస్తుంటాడు. మిగతా హీరోల ఎదుగుదలను జాగ్రత్తగా గమనిస్తుంటాడు. ఎవరికీ తీసిపోని విధంగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటాడు. వరుసగా త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులతో అతను లైనప్ సెట్ చేసుకున్నాడు. ఐతే పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే వీళ్లెవ్వరితోనూ పని కాదు. రాజమౌళినో, ప్రశాంత్ నీల్నో ఎంచుకోవాల్సింది. రాజమౌళితో ఇప్పుడిప్పుడే వర్కవుటయ్యేలా లేదు. కాబట్టి ప్రశాంత్ మీద అతడి కళ్లు పడ్డట్లున్నాయి. అందుకే తమ కలయికలో సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉంది.
ఐతే ఎన్టీఆర్తో చేశాక బన్నీతో ప్రశాంత్ సినిమా చేస్తే.. నందమూరి అభిమానులకు అభ్యంతరం లేదు. కానీ అనుకోకుండా వచ్చి పడ్డ ‘సలార్’ లాగే.. తారక్ ప్రాజెక్టును వెనక్కి నెట్టే బన్నీతో వేరే సినిమా చేస్తాడేమో అని ప్రశాంత్ మీద వారికి అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసి, త్రివిక్రమ్ సినిమాను ముగించేసరికి తారక్కు ఆలస్యం కావచ్చు. ఈ మధ్యలో ఖాళీ దొరికితే బన్నీ-ప్రశాంత్ సినిమా ఏమైనా సెట్ అయిపోతుందేమో అన్నది వారి భయం.
This post was last modified on March 10, 2021 2:05 pm
దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి శుక్రవారంతో 10 మాసాలు గడిచాయి. గత ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి సర్కారుకొలువు…
హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా…