‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే తొలి చిత్రం తమ హీరోతోనే అని చాలా ఆనందపడిపోయారు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. తారక్-ప్రశాంత్ కలయికలో సినిమాకు రంగం సిద్ధం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అప్పట్లో.. ఈ సినిమా గురించి అప్ డేట్ సైతం ఇచ్చింది.
కానీ ఊహించని విధంగా ప్రభాస్తో ‘సలార్’ మొదలుపెట్టేశాడు ప్రశాంత్. దీంతో తారక్తో అతడి సినిమా సంగతేంటని అభిమానులు టెన్షన్ పడిపోయారు. వారి ఆందోళనను తీర్చేస్తూ.. ఇటీవల ‘ఉప్పెన’ ప్రమోషన్ల సందర్భంగా తారక్-ప్రశాంత్ సినిమా తప్పక ఉంటుందని తేల్చారు మైత్రీ అధినేతలు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టుపై సందేహాలు రేకెత్తించే పరిణామం జరిగింది.
ప్రశాంత్ నీల్ మంగళవారం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు రావడం.. బన్నీతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది అనుకోకుండా జరిగిన పరిణామంలా లేదు. బన్నీతో సినిమా కోసమే కలిసినట్లు తెలుస్తోంది.
బన్నీ సినిమాల ప్లానింగ్ మామూలుగా ఉండదు. దర్శకుల ఎంపికలో పక్కాగా వ్యవహరిస్తుంటాడు. మిగతా హీరోల ఎదుగుదలను జాగ్రత్తగా గమనిస్తుంటాడు. ఎవరికీ తీసిపోని విధంగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటాడు. వరుసగా త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులతో అతను లైనప్ సెట్ చేసుకున్నాడు. ఐతే పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే వీళ్లెవ్వరితోనూ పని కాదు. రాజమౌళినో, ప్రశాంత్ నీల్నో ఎంచుకోవాల్సింది. రాజమౌళితో ఇప్పుడిప్పుడే వర్కవుటయ్యేలా లేదు. కాబట్టి ప్రశాంత్ మీద అతడి కళ్లు పడ్డట్లున్నాయి. అందుకే తమ కలయికలో సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉంది.
ఐతే ఎన్టీఆర్తో చేశాక బన్నీతో ప్రశాంత్ సినిమా చేస్తే.. నందమూరి అభిమానులకు అభ్యంతరం లేదు. కానీ అనుకోకుండా వచ్చి పడ్డ ‘సలార్’ లాగే.. తారక్ ప్రాజెక్టును వెనక్కి నెట్టే బన్నీతో వేరే సినిమా చేస్తాడేమో అని ప్రశాంత్ మీద వారికి అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసి, త్రివిక్రమ్ సినిమాను ముగించేసరికి తారక్కు ఆలస్యం కావచ్చు. ఈ మధ్యలో ఖాళీ దొరికితే బన్నీ-ప్రశాంత్ సినిమా ఏమైనా సెట్ అయిపోతుందేమో అన్నది వారి భయం.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…