ప్రతి దర్శకుడికీ కొన్ని అభిరుచులు, ఆసక్తులు ఉంటాయి. బాగా ఆకర్షించే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని తమ సినిమాల్లో జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ అభిరుచితోనే తమ సిగ్నేచర్ మార్క్ వేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ సిగ్నేచర్ కనిపించేది.. ప్రకృతి అందాల మధ్య సినిమా తీయడంతోనే. ఆయనకు అడవి అన్నా.. అక్కడి ప్రకృతి అందాలన్నా చాలా ఇష్టం. అలాగే అటవీ జంతువులన్నా కూడా మహా ప్రీతి. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకమైన కథలు ఎంచుకుని ప్రయాణం సాగిస్తుంటారు. అమలాపాల్కు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘ప్రేమఖైదీ’ ప్రభు సాల్మన్ తీసిన సినిమానే. ఆ చిత్రం చాలా వరకు కొండ కోనల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది. ప్రకృతి అందాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ఇక ప్రభు కొడుకు విక్రమ్ను హీరోగా పరిచయం చేస్తూ సాల్మన్ తీసిన ‘గుంకి’ సైతం అడవిని ఆనుకుని ఉండే ఒక పల్లెలో నడిచే సినిమా. ఇందులో హీరో మావటి. అతడి దగ్గరుండే ఏనుగు చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆ సినిమా చూస్తూ మనం మరిచిపోయిన మూలాల్లోకి వెళ్లిపోతాం.
ఇప్పుడు ఈ దర్శకుడు రానా హీరోగా ‘అరణ్య’ సినిమాను తెరకెక్కించాడు. అతడికి అడవి, అక్కడుండే జంతువులంటే ఎంతిష్టం అన్నది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తన అభిరుచిని, ఆసక్తిని.. అలాగే అడవి, అక్కడి జంతువుల పట్ల తన ఆవేదనను ప్రభు సాల్మన్ ఎంతో హృద్యంగా చూపించినట్లున్నాడు. ఇందులో హీరో ఏనుగులను రక్షించే టార్జాన్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాల్లేవు కానీ.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి అందరిలోనూ ఒక కదలిక వచ్చింది. మనిషి తన స్వార్థం కోసం జంతువుల హక్కులను ఎలా కాల రాస్తున్నాడో ఈ సినిమాలా చాలా చక్కగా చర్చించినట్లున్నాడు దర్శకుడు. ట్రైలర్ చూసిన వాళ్లందరికీ ఇందులోని గొప్ప సందేశం బాగా అర్థమైంది. నేరుగా అది హృదయాలను తాకింది. ఇండియాలో ఇలా అటవీ నేపథ్యంలో ఇలాంటి సిన్సియర్ మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న, మంచి కాజ్తో రూపొందించిన ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on March 5, 2021 5:09 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…