ప్రతి దర్శకుడికీ కొన్ని అభిరుచులు, ఆసక్తులు ఉంటాయి. బాగా ఆకర్షించే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని తమ సినిమాల్లో జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ అభిరుచితోనే తమ సిగ్నేచర్ మార్క్ వేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ సిగ్నేచర్ కనిపించేది.. ప్రకృతి అందాల మధ్య సినిమా తీయడంతోనే. ఆయనకు అడవి అన్నా.. అక్కడి ప్రకృతి అందాలన్నా చాలా ఇష్టం. అలాగే అటవీ జంతువులన్నా కూడా మహా ప్రీతి. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకమైన కథలు ఎంచుకుని ప్రయాణం సాగిస్తుంటారు. అమలాపాల్కు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘ప్రేమఖైదీ’ ప్రభు సాల్మన్ తీసిన సినిమానే. ఆ చిత్రం చాలా వరకు కొండ కోనల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది. ప్రకృతి అందాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ఇక ప్రభు కొడుకు విక్రమ్ను హీరోగా పరిచయం చేస్తూ సాల్మన్ తీసిన ‘గుంకి’ సైతం అడవిని ఆనుకుని ఉండే ఒక పల్లెలో నడిచే సినిమా. ఇందులో హీరో మావటి. అతడి దగ్గరుండే ఏనుగు చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆ సినిమా చూస్తూ మనం మరిచిపోయిన మూలాల్లోకి వెళ్లిపోతాం.
ఇప్పుడు ఈ దర్శకుడు రానా హీరోగా ‘అరణ్య’ సినిమాను తెరకెక్కించాడు. అతడికి అడవి, అక్కడుండే జంతువులంటే ఎంతిష్టం అన్నది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తన అభిరుచిని, ఆసక్తిని.. అలాగే అడవి, అక్కడి జంతువుల పట్ల తన ఆవేదనను ప్రభు సాల్మన్ ఎంతో హృద్యంగా చూపించినట్లున్నాడు. ఇందులో హీరో ఏనుగులను రక్షించే టార్జాన్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాల్లేవు కానీ.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి అందరిలోనూ ఒక కదలిక వచ్చింది. మనిషి తన స్వార్థం కోసం జంతువుల హక్కులను ఎలా కాల రాస్తున్నాడో ఈ సినిమాలా చాలా చక్కగా చర్చించినట్లున్నాడు దర్శకుడు. ట్రైలర్ చూసిన వాళ్లందరికీ ఇందులోని గొప్ప సందేశం బాగా అర్థమైంది. నేరుగా అది హృదయాలను తాకింది. ఇండియాలో ఇలా అటవీ నేపథ్యంలో ఇలాంటి సిన్సియర్ మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న, మంచి కాజ్తో రూపొందించిన ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on March 5, 2021 5:09 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…