ప్రతి దర్శకుడికీ కొన్ని అభిరుచులు, ఆసక్తులు ఉంటాయి. బాగా ఆకర్షించే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని తమ సినిమాల్లో జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ అభిరుచితోనే తమ సిగ్నేచర్ మార్క్ వేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ సిగ్నేచర్ కనిపించేది.. ప్రకృతి అందాల మధ్య సినిమా తీయడంతోనే. ఆయనకు అడవి అన్నా.. అక్కడి ప్రకృతి అందాలన్నా చాలా ఇష్టం. అలాగే అటవీ జంతువులన్నా కూడా మహా ప్రీతి. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకమైన కథలు ఎంచుకుని ప్రయాణం సాగిస్తుంటారు. అమలాపాల్కు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘ప్రేమఖైదీ’ ప్రభు సాల్మన్ తీసిన సినిమానే. ఆ చిత్రం చాలా వరకు కొండ కోనల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది. ప్రకృతి అందాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ఇక ప్రభు కొడుకు విక్రమ్ను హీరోగా పరిచయం చేస్తూ సాల్మన్ తీసిన ‘గుంకి’ సైతం అడవిని ఆనుకుని ఉండే ఒక పల్లెలో నడిచే సినిమా. ఇందులో హీరో మావటి. అతడి దగ్గరుండే ఏనుగు చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆ సినిమా చూస్తూ మనం మరిచిపోయిన మూలాల్లోకి వెళ్లిపోతాం.
ఇప్పుడు ఈ దర్శకుడు రానా హీరోగా ‘అరణ్య’ సినిమాను తెరకెక్కించాడు. అతడికి అడవి, అక్కడుండే జంతువులంటే ఎంతిష్టం అన్నది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తన అభిరుచిని, ఆసక్తిని.. అలాగే అడవి, అక్కడి జంతువుల పట్ల తన ఆవేదనను ప్రభు సాల్మన్ ఎంతో హృద్యంగా చూపించినట్లున్నాడు. ఇందులో హీరో ఏనుగులను రక్షించే టార్జాన్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాల్లేవు కానీ.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి అందరిలోనూ ఒక కదలిక వచ్చింది. మనిషి తన స్వార్థం కోసం జంతువుల హక్కులను ఎలా కాల రాస్తున్నాడో ఈ సినిమాలా చాలా చక్కగా చర్చించినట్లున్నాడు దర్శకుడు. ట్రైలర్ చూసిన వాళ్లందరికీ ఇందులోని గొప్ప సందేశం బాగా అర్థమైంది. నేరుగా అది హృదయాలను తాకింది. ఇండియాలో ఇలా అటవీ నేపథ్యంలో ఇలాంటి సిన్సియర్ మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న, మంచి కాజ్తో రూపొందించిన ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on March 5, 2021 5:09 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…