ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమితం అవుతున్న సినిమా ‘బంగార్రాజు’పై ఇటీవల అక్కినేని నాగార్జున కీలక ప్రటకన చేశాడు. ఈ ఏడాదే, మరి కొన్ని నెలల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని, ఈ సినిమా ఎఫ్పుడు చేసినా సంక్రాంతికే విడుదల చేయాలన్నది తన అభిమతమని, ఈ సంక్రాంతికి అనుకుంటే కుదరలేదని, వచ్చే సంక్రాంతికి మాత్రం కచ్చితంగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని, ఏం జరుగుతుందో చూడాలని నాగ్ అన్నాడు.
ఐతే నాగ్ ఈ ప్రకటన చేయడానికి ముందే రెండు భారీ చిత్రాలు 2022 సంక్రాంతికి ఖరారయ్యాయి. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ చాన్నాళ్ల కిందటే ఇచ్చారు. ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కూడా రేసులోకి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్లు. వాళ్ల సినిమాలు ఎప్పుడూ ఇలా నేరుగా బాక్సాఫీస్ క్లాష్కు దిగింది లేదు. గతంలో ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ కొంచెం గ్యాప్లో ఆ చిత్రాలు రిలీజయ్యాయి. కానీ ఈసారి ఒకట్రెండు రోజుల విరామంలో ఈ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. మామూలుగా వీళ్లలో ఒకరి సినిమా బరిలో ఉన్నా.. వేరే చిత్రాలను పోటీకి నిలపడడానికి భయపడతారు. అలాంటిది ఇద్దరి సినిమాలూ పోటీ పడుతున్నాయంటే వేరే వాళ్లకు ఛాన్స్ లేనట్లే.
ఐతే నాగార్జునకు ఈ విషయం తెలుసో లేదో కానీ.. తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు. ఐతే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు చాలా బాగా ఆడేస్తాయని, వేరే సినిమాలు ఎన్ని పోటీలో ఉన్నా ఇబ్బంది లేదని, 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ కంటే పెద్ద సినిమాలు రిలీజైనా అదే బాక్సాఫీస్ విజేతగా నిలిచింది కాబట్టి.. ‘బంగార్రాజు’కు కూడా మంచి ఫలితమే దక్కుతుందని ఆయన ధీమాగా ఉండొచ్చు. ఐతే ఇంతకీ అసలు ‘బంగార్రాజు’ ఈ ఏడాదైనా అనుకున్నట్లు పట్టాలెక్కి పూర్తయితే తర్వాత సంక్రాంతి రిలీజ్ సంగతి చూద్దామని అంటున్నారు టాలీవుడ్ జనాలు.
This post was last modified on March 3, 2021 10:38 pm
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు…