ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమితం అవుతున్న సినిమా ‘బంగార్రాజు’పై ఇటీవల అక్కినేని నాగార్జున కీలక ప్రటకన చేశాడు. ఈ ఏడాదే, మరి కొన్ని నెలల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని, ఈ సినిమా ఎఫ్పుడు చేసినా సంక్రాంతికే విడుదల చేయాలన్నది తన అభిమతమని, ఈ సంక్రాంతికి అనుకుంటే కుదరలేదని, వచ్చే సంక్రాంతికి మాత్రం కచ్చితంగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని, ఏం జరుగుతుందో చూడాలని నాగ్ అన్నాడు.
ఐతే నాగ్ ఈ ప్రకటన చేయడానికి ముందే రెండు భారీ చిత్రాలు 2022 సంక్రాంతికి ఖరారయ్యాయి. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ చాన్నాళ్ల కిందటే ఇచ్చారు. ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కూడా రేసులోకి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్లు. వాళ్ల సినిమాలు ఎప్పుడూ ఇలా నేరుగా బాక్సాఫీస్ క్లాష్కు దిగింది లేదు. గతంలో ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ కొంచెం గ్యాప్లో ఆ చిత్రాలు రిలీజయ్యాయి. కానీ ఈసారి ఒకట్రెండు రోజుల విరామంలో ఈ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. మామూలుగా వీళ్లలో ఒకరి సినిమా బరిలో ఉన్నా.. వేరే చిత్రాలను పోటీకి నిలపడడానికి భయపడతారు. అలాంటిది ఇద్దరి సినిమాలూ పోటీ పడుతున్నాయంటే వేరే వాళ్లకు ఛాన్స్ లేనట్లే.
ఐతే నాగార్జునకు ఈ విషయం తెలుసో లేదో కానీ.. తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు. ఐతే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు చాలా బాగా ఆడేస్తాయని, వేరే సినిమాలు ఎన్ని పోటీలో ఉన్నా ఇబ్బంది లేదని, 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ కంటే పెద్ద సినిమాలు రిలీజైనా అదే బాక్సాఫీస్ విజేతగా నిలిచింది కాబట్టి.. ‘బంగార్రాజు’కు కూడా మంచి ఫలితమే దక్కుతుందని ఆయన ధీమాగా ఉండొచ్చు. ఐతే ఇంతకీ అసలు ‘బంగార్రాజు’ ఈ ఏడాదైనా అనుకున్నట్లు పట్టాలెక్కి పూర్తయితే తర్వాత సంక్రాంతి రిలీజ్ సంగతి చూద్దామని అంటున్నారు టాలీవుడ్ జనాలు.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…