ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమితం అవుతున్న సినిమా ‘బంగార్రాజు’పై ఇటీవల అక్కినేని నాగార్జున కీలక ప్రటకన చేశాడు. ఈ ఏడాదే, మరి కొన్ని నెలల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని, ఈ సినిమా ఎఫ్పుడు చేసినా సంక్రాంతికే విడుదల చేయాలన్నది తన అభిమతమని, ఈ సంక్రాంతికి అనుకుంటే కుదరలేదని, వచ్చే సంక్రాంతికి మాత్రం కచ్చితంగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని, ఏం జరుగుతుందో చూడాలని నాగ్ అన్నాడు.
ఐతే నాగ్ ఈ ప్రకటన చేయడానికి ముందే రెండు భారీ చిత్రాలు 2022 సంక్రాంతికి ఖరారయ్యాయి. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ చాన్నాళ్ల కిందటే ఇచ్చారు. ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కూడా రేసులోకి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్లు. వాళ్ల సినిమాలు ఎప్పుడూ ఇలా నేరుగా బాక్సాఫీస్ క్లాష్కు దిగింది లేదు. గతంలో ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ కొంచెం గ్యాప్లో ఆ చిత్రాలు రిలీజయ్యాయి. కానీ ఈసారి ఒకట్రెండు రోజుల విరామంలో ఈ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. మామూలుగా వీళ్లలో ఒకరి సినిమా బరిలో ఉన్నా.. వేరే చిత్రాలను పోటీకి నిలపడడానికి భయపడతారు. అలాంటిది ఇద్దరి సినిమాలూ పోటీ పడుతున్నాయంటే వేరే వాళ్లకు ఛాన్స్ లేనట్లే.
ఐతే నాగార్జునకు ఈ విషయం తెలుసో లేదో కానీ.. తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు. ఐతే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు చాలా బాగా ఆడేస్తాయని, వేరే సినిమాలు ఎన్ని పోటీలో ఉన్నా ఇబ్బంది లేదని, 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ కంటే పెద్ద సినిమాలు రిలీజైనా అదే బాక్సాఫీస్ విజేతగా నిలిచింది కాబట్టి.. ‘బంగార్రాజు’కు కూడా మంచి ఫలితమే దక్కుతుందని ఆయన ధీమాగా ఉండొచ్చు. ఐతే ఇంతకీ అసలు ‘బంగార్రాజు’ ఈ ఏడాదైనా అనుకున్నట్లు పట్టాలెక్కి పూర్తయితే తర్వాత సంక్రాంతి రిలీజ్ సంగతి చూద్దామని అంటున్నారు టాలీవుడ్ జనాలు.
This post was last modified on March 3, 2021 10:38 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…