మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు మాట్లాడే తీరు చూస్తే తను నిజంగా ఉత్తరాది అమ్మాయేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది తెలుగు అమ్మాయిల కంటే కూడా స్వచ్ఛంగా మన భాషలో మాట్లాడుతుంది మిల్కీ బ్యూటీ. కొన్ని సినిమాల్లో తనే స్వయంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగే కాదు.. ఆమెకు తమిళం కూడా బాగా వచ్చు. అనర్గళంగా మాట్లాడేస్తుంది. నార్త్ అమ్మాయి కాబట్టి హిందీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లిష్లోనూ అదరగొట్టేస్తుంది. కానీ ఇన్ని భాషలు వచ్చినా తమ మాతృ భాష సింధి మాత్రం తనకు సరిగా రాదని అంటోంది తమ్మూ. తన తల్లిదండ్రుల భాష సింధినే అని.. వాళ్లు ఇంట్లో ఆ భాషలోనే మాట్లాడుకుంటారని.. కానీ తనకు మాత్రం ఆ భాషపై పట్టులేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
లాక్ డౌన్ టైంలో ఆ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు తమన్నా వెల్లడించింది. మా అమ్మ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని ఉండేది. వాళ్ల పరిజ్ఞానం, నైపుణ్యం తర్వాతి తరాలకు అందించాలి. కానీ సినిమాలతో తీరిక దొరక్క దానిపై దృష్టి సారించలేదు. మా కుటుంబానికి సింధి మాతృభాష. ఐతే తెలుగు, తమిళం బాగా మాట్లాడే నాకు ఆ భాష సరిగా రాదు. ఐతే నాకే సరిగా ఆ భాష రానపుడు తర్వాతి తరానికి ఏం అందించగలుగుతా. అందుకే లాక్ డౌన్ టైంలో ఆ భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంట్లో మా అమ్మను నాతో సింధి మాత్రమే మాట్లాడమని చెప్పా. ఏడాది తిరిగేసరికి ఈ భాషపై పట్టు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నా అని తమన్నా చెప్పింది. కేవలం సినిమాల్లో నటించడం ద్వారా తెలుగు, తమిళం సులువుగా నేర్చుకున్న తమన్నా.. ఇలా పట్టుబట్టిందంటే సింధి నేర్చుకోవడం ఎంతసేపు?
This post was last modified on May 9, 2020 3:57 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…