మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు మాట్లాడే తీరు చూస్తే తను నిజంగా ఉత్తరాది అమ్మాయేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది తెలుగు అమ్మాయిల కంటే కూడా స్వచ్ఛంగా మన భాషలో మాట్లాడుతుంది మిల్కీ బ్యూటీ. కొన్ని సినిమాల్లో తనే స్వయంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగే కాదు.. ఆమెకు తమిళం కూడా బాగా వచ్చు. అనర్గళంగా మాట్లాడేస్తుంది. నార్త్ అమ్మాయి కాబట్టి హిందీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లిష్లోనూ అదరగొట్టేస్తుంది. కానీ ఇన్ని భాషలు వచ్చినా తమ మాతృ భాష సింధి మాత్రం తనకు సరిగా రాదని అంటోంది తమ్మూ. తన తల్లిదండ్రుల భాష సింధినే అని.. వాళ్లు ఇంట్లో ఆ భాషలోనే మాట్లాడుకుంటారని.. కానీ తనకు మాత్రం ఆ భాషపై పట్టులేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
లాక్ డౌన్ టైంలో ఆ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు తమన్నా వెల్లడించింది. మా అమ్మ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని ఉండేది. వాళ్ల పరిజ్ఞానం, నైపుణ్యం తర్వాతి తరాలకు అందించాలి. కానీ సినిమాలతో తీరిక దొరక్క దానిపై దృష్టి సారించలేదు. మా కుటుంబానికి సింధి మాతృభాష. ఐతే తెలుగు, తమిళం బాగా మాట్లాడే నాకు ఆ భాష సరిగా రాదు. ఐతే నాకే సరిగా ఆ భాష రానపుడు తర్వాతి తరానికి ఏం అందించగలుగుతా. అందుకే లాక్ డౌన్ టైంలో ఆ భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇంట్లో మా అమ్మను నాతో సింధి మాత్రమే మాట్లాడమని చెప్పా. ఏడాది తిరిగేసరికి ఈ భాషపై పట్టు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నా అని తమన్నా చెప్పింది. కేవలం సినిమాల్లో నటించడం ద్వారా తెలుగు, తమిళం సులువుగా నేర్చుకున్న తమన్నా.. ఇలా పట్టుబట్టిందంటే సింధి నేర్చుకోవడం ఎంతసేపు?
This post was last modified on May 9, 2020 3:57 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…