అల్లరి నరేష్ లేక లేక విజయాన్నందించిన చిత్రం ‘నాంది’. సోలో హీరోగా ఎనిమిదేళ్లుగా అతడికి సరైన విజయం లేదు. అతను సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లేమీ కోరుకోలేదు. తన సినిమా హిట్ అనిపించుకుంటే చాలనుకున్నాడు. కానీ ‘నాంది’ అంచనాల్ని మించిపోయి.. అతను కోరుకున్నదానికంటే పెద్ద విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బయ్యర్లందరికీ లాభాలు పంచుతోంది. అత్యాశకు పోకుండా నిర్మాత తక్కువ రేట్లకు సినిమాను ఇచ్చి మంచి పని చేశాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకోవడంతో డిజిటల్, శాటిలైట్, రీమేక్ రైట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేయడానికి ఇప్పటికే దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని, హక్కులు కొనేశాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘నాంది’కి డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ కూడా ఓకే అయిపోయిందట. తెలుగువారి ఓటీటీ ‘ఆహా’ ఈ చిత్రాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ను మించి రేటు పలికాయట డిజిటల్ రైట్స్ రూ.2.25 కోట్లకు ‘నాంది’ హక్కులను దక్కించుకుందట ఆహా. ఈ సినిమాకు ఇది పెద్ద రేటే. ఐతే ఉన్న సబ్స్క్రైబర్లను నిలబెట్టే, కొత్త సబ్స్క్రిప్షన్లు పెంచే సత్తా ఉన్న ‘నాంది’కి ఆ రేటు పెట్టడం ఎక్కువేమీ కాదని ఆహా వారు భావించారట.
ఈ చిత్రాన్ని మార్చి మధ్యలో స్ట్రీమింగ్ చేయాలని ఆహా టీం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికి ‘నాంది’ అన్ని రకాలుగా మంచి ఆదాయమే తెచ్చిపెడుతోంది. నిర్మాత పంట పండినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రం అన్ని మార్గాల్లో కలిపి రూ.10 కోట్లకు అటు ఇటుగా ఆదాయం తెచ్చి పెడుతుందని అంచనా. సినిమాను రూ.2 కోట్ల బడ్జెట్లో తీసినట్లు చెబుతన్నారు. దీన్ని బట్టే నిర్మాత లాభమెంతో అంచనా వేయొచ్చు. నరేష్తో పాటు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల కెరీర్లకు ఈ సినిమా ఎంత మేలు చేస్తుందో చెప్పేదేముంది?
This post was last modified on February 27, 2021 3:50 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…