నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఎన్నో భిన్నమైన సినిమాలు చేశాడు. కొత్త కథలతో ప్రయాణం సాగించాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం అతడిపై అప్పుడప్పుడూ విమర్శలు వస్తుంటాయి. లుక్ పరంగా పెద్దగా మార్పు ఉండదని.. ఎక్కువగా పక్కింటి అబ్బాయి లుక్లోనే కనిపిస్తుంటాడని అంటుంటారు జనాలు. ‘జెండాపై కపిరాజు’, ‘కృష్ణార్జున యుద్ధం’ లాంటి సినిమాల్లో కొంచెం మార్పు చూపించాడు కానీ.. అవి మినహాయిస్తే చాలా వరకు ఒకే లుక్ మెయింటైన్ చేస్తూ వస్తుంటాడు నాని. అతణ్ని భిన్నమైన అవతారాల్లో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటారు.
ఐతే నానితో పని చేసే దర్శకులు అతడికి ఆ అవకాశం ఇవ్వట్లేదు. అతను చేసే కథల్లో చాలా వరకు మధ్య తరగతి అబ్బాయి పాత్రలే ఉంటుండటంతో లుక్ పరంగా వైవిధ్యం చూపించడానికి అవకాశం లేకపోయింది. ఐతే చాన్నాళ్ల తర్వాత నాని కొత్తగా కనిపించే అవకాశాన్ని ‘శ్యామ్ సింగ రాయ్’ ఇవ్వబోతోందని ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టం అయింది.
నాని చేస్తున్న తొలి పీరియడ్ మూవీ ఇది. కొన్ని దశాబ్దాల వెనుకటి నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. కోల్కతా బ్యాక్ డ్రాప్ కావడం, పాత్ర పేరు కూడా శ్యామ్ సింగ రాయ్ కావడంతో నాని లుక్ మార్చడానికి అవకాశం వచ్చింది. 70లు, 80ల్లో బెంగాలీల వేషధారణ ఎలా ఉండోదో బాగా స్టడీ చేసి నాని పాత్రను తీర్చిదిద్దినట్లున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యన్. డ్రెస్సింగ్, హేర్ స్టైల్, మీసం.. ఇలా ప్రతిదీ మార్చుకుని సరికొత్త అవతారంలోకి మారిన నాని.. అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. నానీని ఇలాంటి అవతారంలో చూస్తామని ఎవ్వరూ అనుకోలేదు.
నానికి చాలా అవసరమైన మేకోవర్ ఇదని ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్ చూసిన వాళ్లు అభిప్రాయపడుతున్నారు. నటన పరంగా కూడా వైవిధ్యం చూపించడానికి నానికి ఈ సినిమా మంచి అవకాశం ఇచ్చినట్లే ఉంది. సరిగా తీస్తే ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యే కెపాసిటీ ఉన్న సినిమాగా ‘శ్యామ్ సింగ రాయ్’ గురించి చెబుతున్నారు. మరి ఈ చిత్రం నాని ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…