Movie News

పెద్ద స్టార్లు ఇద్దరూ తెగేసి చెప్పేశారు

దాదాపు 2 నెలలుగా లాక్‌డౌన్ పొడగిస్తూ పోతుండడంతో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనేది అనుమానంగా మారింది. దాంతో నేరుగా ఓటీటీ రిలీజ్ మాట బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని చిత్రరంగాల్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని చిన్న చిత్రాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యాయి కూడా. తమిళంలో హీరో సూర్య భార్య జ్యోతిక సినిమా కూడా పొన్మగాల్ వందాళ్ సినిమాను డైరక్టుగా ఓటిటి రిలీజుకు ఇచ్చేశారు. దానితో పెద్ద వివాదమే నడుస్తోంది.

ఇకపోతే ఎన్ని నెలల లేట్ అయినా పర్లేదు… వెయిట్ చేస్తాం కానీ ఓటీటీ రిలీజ్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు కొందరు తెలుగు హీరోలు. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఇదే మాట అంటున్నారు. కోలీవుడ్ ‘తలపతి’ విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారు.

అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తంత్రం’ సినిమాను మే1న రిలీజ్ చేయాలని షెడ్యూల్ చేశారు. కానీ లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఈ సినిమాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో ఓటీటీ సంస్థల నుంచి ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందట. అయితే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు ఈ ఇద్దరు స్టార్లు ‘నో’ చెప్పేశారు.

‘మేం సినిమాలు చేసేది అభిమానుల కోసం… థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్ కోసం…’ అంటూ ఓటీటీ ఆఫర్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడట విజయ్. ధనుష్ కూడా లేట్‌గా అయినా వస్తా కానీ ఓటీటీలో మాత్రం రిలీజ్ చేయమని తెగేసి చెప్పాడట. దీంతో స్టార్ల సినిమాలతో క్రేజ్ పెంచుకోవాలనుకున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి గట్టి దెబ్బ తగిలింది. అయితే ఇదంతా సూర్య మీద వచ్చిన నెగెటివ్ రియాక్షన్ చూసే అంటున్నారు కొందరు సినిమావర్గీయులు.

This post was last modified on May 8, 2020 6:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago