దాదాపు 2 నెలలుగా లాక్డౌన్ పొడగిస్తూ పోతుండడంతో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనేది అనుమానంగా మారింది. దాంతో నేరుగా ఓటీటీ రిలీజ్ మాట బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని చిత్రరంగాల్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని చిన్న చిత్రాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో విడుదలయ్యాయి కూడా. తమిళంలో హీరో సూర్య భార్య జ్యోతిక సినిమా కూడా పొన్మగాల్ వందాళ్ సినిమాను డైరక్టుగా ఓటిటి రిలీజుకు ఇచ్చేశారు. దానితో పెద్ద వివాదమే నడుస్తోంది.
ఇకపోతే ఎన్ని నెలల లేట్ అయినా పర్లేదు… వెయిట్ చేస్తాం కానీ ఓటీటీ రిలీజ్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు కొందరు తెలుగు హీరోలు. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఇదే మాట అంటున్నారు. కోలీవుడ్ ‘తలపతి’ విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారు.
అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తంత్రం’ సినిమాను మే1న రిలీజ్ చేయాలని షెడ్యూల్ చేశారు. కానీ లాక్డౌన్ ఎఫెక్ట్తో ఈ సినిమాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో ఓటీటీ సంస్థల నుంచి ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందట. అయితే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్కు ఈ ఇద్దరు స్టార్లు ‘నో’ చెప్పేశారు.
‘మేం సినిమాలు చేసేది అభిమానుల కోసం… థియేటర్లో అభిమానులు వేసే విజిల్స్ కోసం…’ అంటూ ఓటీటీ ఆఫర్కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడట విజయ్. ధనుష్ కూడా లేట్గా అయినా వస్తా కానీ ఓటీటీలో మాత్రం రిలీజ్ చేయమని తెగేసి చెప్పాడట. దీంతో స్టార్ల సినిమాలతో క్రేజ్ పెంచుకోవాలనుకున్న ఓటీటీ ఫ్లాట్ఫామ్స్కి గట్టి దెబ్బ తగిలింది. అయితే ఇదంతా సూర్య మీద వచ్చిన నెగెటివ్ రియాక్షన్ చూసే అంటున్నారు కొందరు సినిమావర్గీయులు.
This post was last modified on May 8, 2020 6:46 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…