Movie News

మొద‌ల‌వ‌కుండానే ఆగిపోయిన ఆ సినిమా

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భార‌తావ‌నికి ప‌త‌కాల ప‌ట్టిక‌లో చోటు క‌ల్పించి దేశం ప‌రువు నిలిపిన దిగ్గ‌జ క్రీడాకారిణి క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి. ఆ ఒలింపిక్స్‌లో అసాధార‌ణ ప‌ట్టుద‌ల‌తో పోరాడిన ఆమె.. కాంస్య ప‌త‌కం గెలిచింది. ఈ ఉక్కు మ‌హిళది తెలుగు గ‌డ్డే అన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాకుళంకు చెందిన ఈ లెజెండ‌రీ వెయిట్ లిఫ్ట‌ర్ జీవిత క‌థ‌తో ఓ సినిమా తీయ‌బోతున్న‌ట్లు గ‌త ఏడాది ఘ‌నంగా ప్ర‌క‌ట‌న చేశారు.

వైజాగ్ ఎంపీ, నిర్మాత అయిన ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి రైట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. సంజ‌నా రెడ్డి అనే మ‌హిళా ద‌ర్శ‌కురాలిని ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్ర‌క‌ట‌న అయితే ఘ‌నంగా చేశారు కానీ.. ఇప్ప‌టిదాకా ఆ సినిమా గురించి మ‌రో అప్‌డేట్ లేదు.

ఐతే ఎట్ట‌కేల‌కు మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ గురించి ఓ అప్‌డేట్ వచ్చింది. ఆ సినిమా మొద‌ల‌వ‌కుండానే ఆగిపోయింది అన్న‌దే ఆ అప్‌డేట్. స‌రిగ్గా కార‌ణాలేంట‌న్న‌ది బ‌య‌టికి రాలేదు కానీ.. ఈ చిత్రం ముందుకు క‌దిలే అవ‌కాశాలు లేవ‌న్న‌ది తాజా స‌మాచారం. మ‌ల్లీశ్వ‌రి పాత్ర కోసం కొంద‌రు హీరోయిన్ల‌ను అడిగి లేద‌నిపించుకుని చివ‌రికి రకుల్ ప్రీత్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌కు ఆమె ఏమాత్రం సూట‌వుతుంద‌న్న‌ది సందేహ‌మే.

కాగా పాన్ ఇండియా లెవెల్లో చేయాల‌నుకున్న ఈ చిత్రానికి భారీ బ‌డ్జెట్టే అవ‌స‌ర‌మ‌వుతుంది. కానీ అందుకు త‌గ్గ‌ట్లు ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీని మార్కెట్ చేయ‌డం తేలిక కాదు. ఈ త‌రం స్పోర్ట్స్ స్టార్లయిన సైనా, సింధుల‌ బ‌యోపిక్‌లే ముందుకు క‌ద‌ల‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇప్ప‌టి త‌రానికి పెద్ద‌గా తెలియ‌ని మ‌ల్లీశ్వ‌రి క‌థ‌తో సినిమా తీస్తే వ‌ర్క‌వుట్ అవుతుందో కాదో అన్న సందేహాల మ‌ధ్య ఈ సినిమాకు బ్రేక్ ప‌డిన‌ట్లుగా చెప్పుకుంటున్నారు.

This post was last modified on February 19, 2021 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

19 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

2 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago