2000 సిడ్నీ ఒలింపిక్స్లో భారతావనికి పతకాల పట్టికలో చోటు కల్పించి దేశం పరువు నిలిపిన దిగ్గజ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి. ఆ ఒలింపిక్స్లో అసాధారణ పట్టుదలతో పోరాడిన ఆమె.. కాంస్య పతకం గెలిచింది. ఈ ఉక్కు మహిళది తెలుగు గడ్డే అన్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళంకు చెందిన ఈ లెజెండరీ వెయిట్ లిఫ్టర్ జీవిత కథతో ఓ సినిమా తీయబోతున్నట్లు గత ఏడాది ఘనంగా ప్రకటన చేశారు.
వైజాగ్ ఎంపీ, నిర్మాత అయిన ఎంవీవీ సత్యనారాయణతో కలిసి రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. సంజనా రెడ్డి అనే మహిళా దర్శకురాలిని ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్రకటన అయితే ఘనంగా చేశారు కానీ.. ఇప్పటిదాకా ఆ సినిమా గురించి మరో అప్డేట్ లేదు.
ఐతే ఎట్టకేలకు మల్లీశ్వరి బయోపిక్ గురించి ఓ అప్డేట్ వచ్చింది. ఆ సినిమా మొదలవకుండానే ఆగిపోయింది అన్నదే ఆ అప్డేట్. సరిగ్గా కారణాలేంటన్నది బయటికి రాలేదు కానీ.. ఈ చిత్రం ముందుకు కదిలే అవకాశాలు లేవన్నది తాజా సమాచారం. మల్లీశ్వరి పాత్ర కోసం కొందరు హీరోయిన్లను అడిగి లేదనిపించుకుని చివరికి రకుల్ ప్రీత్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ మల్లీశ్వరి పాత్రకు ఆమె ఏమాత్రం సూటవుతుందన్నది సందేహమే.
కాగా పాన్ ఇండియా లెవెల్లో చేయాలనుకున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్టే అవసరమవుతుంది. కానీ అందుకు తగ్గట్లు ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీని మార్కెట్ చేయడం తేలిక కాదు. ఈ తరం స్పోర్ట్స్ స్టార్లయిన సైనా, సింధుల బయోపిక్లే ముందుకు కదలని ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటి తరానికి పెద్దగా తెలియని మల్లీశ్వరి కథతో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందో కాదో అన్న సందేహాల మధ్య ఈ సినిమాకు బ్రేక్ పడినట్లుగా చెప్పుకుంటున్నారు.
This post was last modified on February 19, 2021 9:54 am
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…