పవర్ స్టార్ పవన్ సినిమా కెరీర్లో రీమేక్లు చాలానే ఉన్నాయి. ఆయన రీఎంట్రీ మూవీ హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దీని కంటే ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రం ‘కాటమరాయుడు’. తమిళంలో అజిత్ హీరోగా ‘శౌర్యం’ శివ రూపొందించిన చిత్రమిది. అక్కడ పెద్ద విజయమే సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలోనూ పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ముందు అక్షయ్ హీరోగా ‘ల్యాండ్ ఆఫ్ లుంగి’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. కాగా ఇప్పుడు సల్మాన్ హీరోగా ‘వీరం’ను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సల్మాన్ హీరోగా ‘కబీ ఈద్ కబీ దివాలి’ పేరుతో గత ఏడాదో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇది ‘వీరం’ రీమేక్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తుండటం విశేషం.
‘కబీ ఈద్ కబీ దివాలి’ దర్శకుడు ఫర్హద్ సామ్జీ ‘కాంఛన’ సహా కొన్ని సౌత్ రీమేక్లకు పని చేశాడు. అతను ‘వీరం’ సినిమాకు బాలీవుడ్ టచ్ ఇచ్చి ‘కబీ ఈద్ కబీ దివాలి’ పేరుతో సల్మాన్ హీరోగా సినిమా తీయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘రాధే’ను పూర్తి చేసి ‘అంతిమ్’ను ముగించే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత అతను హీరోగా నటించాల్సిన సినిమాలు టైగర్-3, కబీ ఈద్ కబీ దివాలి. ఈ ఏడాది చివర్లో ‘కబీ ఈద్ కబీ దివాలి’ పట్టాలెక్కనుంది.
‘వీరం’ను తెలుగులో తీస్తే వర్కవుట్ కాలేదు. బాలీవుడ్ వాళ్లు సౌత్ నుంచి కథలు తీసుకుంటారు కానీ.. వాటి స్వరూపమే మార్చేస్తారు. సల్మాన్ కూడా ఇక్కడి కథలు చాలానే ఎంచుకుని నటించాడు. వాటికి, మాతృకలకు పెద్దగా పోలికలుండవు. మరి ‘వీరం’ను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఎలా మారుస్తారో.. అక్కడీ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…