పవర్ స్టార్ పవన్ సినిమా కెరీర్లో రీమేక్లు చాలానే ఉన్నాయి. ఆయన రీఎంట్రీ మూవీ హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దీని కంటే ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రం ‘కాటమరాయుడు’. తమిళంలో అజిత్ హీరోగా ‘శౌర్యం’ శివ రూపొందించిన చిత్రమిది. అక్కడ పెద్ద విజయమే సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలోనూ పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ముందు అక్షయ్ హీరోగా ‘ల్యాండ్ ఆఫ్ లుంగి’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. కాగా ఇప్పుడు సల్మాన్ హీరోగా ‘వీరం’ను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సల్మాన్ హీరోగా ‘కబీ ఈద్ కబీ దివాలి’ పేరుతో గత ఏడాదో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇది ‘వీరం’ రీమేక్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తుండటం విశేషం.
‘కబీ ఈద్ కబీ దివాలి’ దర్శకుడు ఫర్హద్ సామ్జీ ‘కాంఛన’ సహా కొన్ని సౌత్ రీమేక్లకు పని చేశాడు. అతను ‘వీరం’ సినిమాకు బాలీవుడ్ టచ్ ఇచ్చి ‘కబీ ఈద్ కబీ దివాలి’ పేరుతో సల్మాన్ హీరోగా సినిమా తీయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘రాధే’ను పూర్తి చేసి ‘అంతిమ్’ను ముగించే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత అతను హీరోగా నటించాల్సిన సినిమాలు టైగర్-3, కబీ ఈద్ కబీ దివాలి. ఈ ఏడాది చివర్లో ‘కబీ ఈద్ కబీ దివాలి’ పట్టాలెక్కనుంది.
‘వీరం’ను తెలుగులో తీస్తే వర్కవుట్ కాలేదు. బాలీవుడ్ వాళ్లు సౌత్ నుంచి కథలు తీసుకుంటారు కానీ.. వాటి స్వరూపమే మార్చేస్తారు. సల్మాన్ కూడా ఇక్కడి కథలు చాలానే ఎంచుకుని నటించాడు. వాటికి, మాతృకలకు పెద్దగా పోలికలుండవు. మరి ‘వీరం’ను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఎలా మారుస్తారో.. అక్కడీ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
This post was last modified on February 15, 2021 6:08 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…