మెగాస్టార్ చిరంజీవితో పని చేయాలని సౌత్ ఇండియాలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా మెజారిటీ దర్శకులు ఆశ పడే వాళ్లే. ఆయనతో సినిమా అంటే దాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారు పెద్ద పెద్ద దర్శకులు కూడా.
వరుసగా నాలుగు బ్లాక్బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ సైతం చిరుతో సినిమా అనేసరికి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో తెలిసిందే. చిరంజీవి ప్రస్థానం అంత గొప్పది. ఆయన స్థాయి అలాంటిది. అలాంటి చిరు ఓ దర్శకుడితో పని చేయాలని ఎంతో తపించారు. బహిరంగంగానే ఆ కోరికను వ్యక్తపరిచారు కూడా. కానీ ఆ కోరిక మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. చిరును అంతగా ఊరించిన ఆ దర్శకుడు మరెవరో కాదు.. శంకర్.
దర్శకుడిగా తన తొలి చిత్రం ‘జెంటిల్మ్యాన్’తోనే శంకర్ తనపై అంచనాల్ని భారీగా పెంచేశాడు. ఆ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన చిరు.. దాని హిందీ రీమేక్లో నటించడం విశేషం. ఆ తర్వాత శంకర్తో నేరుగా పని చేయాలని చిరు అనుకున్నారు.
కానీ ఈ కాంబినేషన్ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ.. వర్కవుట్ కాలేదు. ఆ మధ్య ‘రోబో’ సినిమా ఆడియో వేడుకలో చిరు శంకర్ మీద ప్రశంసలు కురిపించి, అతడిపై తన అభిమానాన్ని చాటుకుని, తనతో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఓపెన్గా రిక్వెస్ట్ చేయడం విశేషం.
ఆ సందర్భంగా చిరుతో పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని, తప్పకుండా అందుకోసం ప్రయత్నిస్తానని శంకర్ అన్నాడు. కానీ ఎప్పుడూ తమిళ స్టార్ల మీదే దృష్టి పెట్టే శంకర్.. తెలుుగలో చిరునే కాదు, మరే హీరోతోనూ కూడా పని చేయలేదు. ఐతే ఇప్పుడు శంకర్.. చిరు తనయుడు రామ్ చరణ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్త బయటికి వచ్చింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.
ఇందుకోసమే ఆయన చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. డీల్ దాదాపు ఓకే అయినట్లే అని.. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ఘనంగా ప్రకటన చేస్తారని అంటున్నారు. మొత్తానికి చిరు కోరిక తీరకున్నా.. ఆయన తనయుడు శంకర్తో పని చేయబోతుండటం విశేషమే.
This post was last modified on February 11, 2021 10:54 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…