మెగాస్టార్ చిరంజీవితో పని చేయాలని సౌత్ ఇండియాలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా మెజారిటీ దర్శకులు ఆశ పడే వాళ్లే. ఆయనతో సినిమా అంటే దాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారు పెద్ద పెద్ద దర్శకులు కూడా.
వరుసగా నాలుగు బ్లాక్బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ సైతం చిరుతో సినిమా అనేసరికి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో తెలిసిందే. చిరంజీవి ప్రస్థానం అంత గొప్పది. ఆయన స్థాయి అలాంటిది. అలాంటి చిరు ఓ దర్శకుడితో పని చేయాలని ఎంతో తపించారు. బహిరంగంగానే ఆ కోరికను వ్యక్తపరిచారు కూడా. కానీ ఆ కోరిక మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. చిరును అంతగా ఊరించిన ఆ దర్శకుడు మరెవరో కాదు.. శంకర్.
దర్శకుడిగా తన తొలి చిత్రం ‘జెంటిల్మ్యాన్’తోనే శంకర్ తనపై అంచనాల్ని భారీగా పెంచేశాడు. ఆ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన చిరు.. దాని హిందీ రీమేక్లో నటించడం విశేషం. ఆ తర్వాత శంకర్తో నేరుగా పని చేయాలని చిరు అనుకున్నారు.
కానీ ఈ కాంబినేషన్ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ.. వర్కవుట్ కాలేదు. ఆ మధ్య ‘రోబో’ సినిమా ఆడియో వేడుకలో చిరు శంకర్ మీద ప్రశంసలు కురిపించి, అతడిపై తన అభిమానాన్ని చాటుకుని, తనతో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఓపెన్గా రిక్వెస్ట్ చేయడం విశేషం.
ఆ సందర్భంగా చిరుతో పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని, తప్పకుండా అందుకోసం ప్రయత్నిస్తానని శంకర్ అన్నాడు. కానీ ఎప్పుడూ తమిళ స్టార్ల మీదే దృష్టి పెట్టే శంకర్.. తెలుుగలో చిరునే కాదు, మరే హీరోతోనూ కూడా పని చేయలేదు. ఐతే ఇప్పుడు శంకర్.. చిరు తనయుడు రామ్ చరణ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్త బయటికి వచ్చింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.
ఇందుకోసమే ఆయన చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. డీల్ దాదాపు ఓకే అయినట్లే అని.. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ఘనంగా ప్రకటన చేస్తారని అంటున్నారు. మొత్తానికి చిరు కోరిక తీరకున్నా.. ఆయన తనయుడు శంకర్తో పని చేయబోతుండటం విశేషమే.
This post was last modified on February 11, 2021 10:54 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…