మెగాస్టార్ చిరంజీవితో పని చేయాలని సౌత్ ఇండియాలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా మెజారిటీ దర్శకులు ఆశ పడే వాళ్లే. ఆయనతో సినిమా అంటే దాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారు పెద్ద పెద్ద దర్శకులు కూడా.
వరుసగా నాలుగు బ్లాక్బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ సైతం చిరుతో సినిమా అనేసరికి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో తెలిసిందే. చిరంజీవి ప్రస్థానం అంత గొప్పది. ఆయన స్థాయి అలాంటిది. అలాంటి చిరు ఓ దర్శకుడితో పని చేయాలని ఎంతో తపించారు. బహిరంగంగానే ఆ కోరికను వ్యక్తపరిచారు కూడా. కానీ ఆ కోరిక మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. చిరును అంతగా ఊరించిన ఆ దర్శకుడు మరెవరో కాదు.. శంకర్.
దర్శకుడిగా తన తొలి చిత్రం ‘జెంటిల్మ్యాన్’తోనే శంకర్ తనపై అంచనాల్ని భారీగా పెంచేశాడు. ఆ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన చిరు.. దాని హిందీ రీమేక్లో నటించడం విశేషం. ఆ తర్వాత శంకర్తో నేరుగా పని చేయాలని చిరు అనుకున్నారు.
కానీ ఈ కాంబినేషన్ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ.. వర్కవుట్ కాలేదు. ఆ మధ్య ‘రోబో’ సినిమా ఆడియో వేడుకలో చిరు శంకర్ మీద ప్రశంసలు కురిపించి, అతడిపై తన అభిమానాన్ని చాటుకుని, తనతో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఓపెన్గా రిక్వెస్ట్ చేయడం విశేషం.
ఆ సందర్భంగా చిరుతో పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని, తప్పకుండా అందుకోసం ప్రయత్నిస్తానని శంకర్ అన్నాడు. కానీ ఎప్పుడూ తమిళ స్టార్ల మీదే దృష్టి పెట్టే శంకర్.. తెలుుగలో చిరునే కాదు, మరే హీరోతోనూ కూడా పని చేయలేదు. ఐతే ఇప్పుడు శంకర్.. చిరు తనయుడు రామ్ చరణ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్త బయటికి వచ్చింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.
ఇందుకోసమే ఆయన చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. డీల్ దాదాపు ఓకే అయినట్లే అని.. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ఘనంగా ప్రకటన చేస్తారని అంటున్నారు. మొత్తానికి చిరు కోరిక తీరకున్నా.. ఆయన తనయుడు శంకర్తో పని చేయబోతుండటం విశేషమే.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…