ప్రభాస్ కొత్త సినిమా సలార్పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించిన ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కేజీఎఫ్ చూసినపుడే ఇందులో ప్రభాస్ హీరో అయితే అని.. ఇలాంటి డైరెక్టర్తో ప్రభాస్తో జట్టు కడితే అని ఊహల్లోకి వెళ్లిపోయారు ఫ్యాన్స్. ఆ ఊహ ఇంత త్వరగా సాధ్యమవుతుందని ఎవ్వరూ అనుకోలేదు.
ఉన్నట్లుండి సినిమాను అనౌన్స్ చేసి, పెద్దగా ఆలస్యం చేయకుండానే షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు ప్రశాంత్. తొలి షెడ్యూల్ జోరుగా నడుస్తుండగా.. ఇంతలో ఓ మీడియా సంస్థతో సలార్ ముచ్చట్లు పంచుకున్నాడు ప్రశాంత్. ఇందులో ప్రభాస్ అభిమానులకు ఉత్తేజం కలిగించే కొన్ని విషయాలు చెప్పాడు.
ప్రభాస్తో ప్రశాంత్ తీస్తున్నది.. దర్శకుడిగా అతడి తొలి సినిమా ఉగ్రంకు రీమేక్ అనే ప్రచారం ముందు నుంచి ఉంది. ఆ కథకు భారీతనం జోడించి ఇప్పుడు ప్రభాస్తో తీస్తున్నాడని వార్తలొచ్చాయి. ఐతే సలార్ రీమేక్ కానే కాదని ప్రశాంత్ తేల్చేశాడు. ఉగ్రం అనే కాదు.. మరే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాకు కూడా ఇది రీమేక్ కాదని.. ఇది కేవలం ప్రభాస్ను దృష్టిలో ఉంచుకుని, అతడికి మాత్రమే సూటయ్యేలా రాసిన కథ అని ప్రశాంత్ వెల్లడించాడు.
ఇక సినిమా రిలీజ్ గురించి కూడా ప్రశాంత్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సెప్టెంబరు-అక్టోబరు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నామని.. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నది తమ ప్రణాళిక అని ప్రశాంత్ వెల్లడించాడు. సలార్ సంక్రాంతికి రావొచ్చని కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తుండగా.. ఇప్పుడు స్వయంగా దర్శకుడి నోటి నుంచే ఆ మాట రావడం ప్రభాస్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on February 4, 2021 9:47 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…