ప్రభాస్ కొత్త సినిమా సలార్పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించిన ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కేజీఎఫ్ చూసినపుడే ఇందులో ప్రభాస్ హీరో అయితే అని.. ఇలాంటి డైరెక్టర్తో ప్రభాస్తో జట్టు కడితే అని ఊహల్లోకి వెళ్లిపోయారు ఫ్యాన్స్. ఆ ఊహ ఇంత త్వరగా సాధ్యమవుతుందని ఎవ్వరూ అనుకోలేదు.
ఉన్నట్లుండి సినిమాను అనౌన్స్ చేసి, పెద్దగా ఆలస్యం చేయకుండానే షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు ప్రశాంత్. తొలి షెడ్యూల్ జోరుగా నడుస్తుండగా.. ఇంతలో ఓ మీడియా సంస్థతో సలార్ ముచ్చట్లు పంచుకున్నాడు ప్రశాంత్. ఇందులో ప్రభాస్ అభిమానులకు ఉత్తేజం కలిగించే కొన్ని విషయాలు చెప్పాడు.
ప్రభాస్తో ప్రశాంత్ తీస్తున్నది.. దర్శకుడిగా అతడి తొలి సినిమా ఉగ్రంకు రీమేక్ అనే ప్రచారం ముందు నుంచి ఉంది. ఆ కథకు భారీతనం జోడించి ఇప్పుడు ప్రభాస్తో తీస్తున్నాడని వార్తలొచ్చాయి. ఐతే సలార్ రీమేక్ కానే కాదని ప్రశాంత్ తేల్చేశాడు. ఉగ్రం అనే కాదు.. మరే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాకు కూడా ఇది రీమేక్ కాదని.. ఇది కేవలం ప్రభాస్ను దృష్టిలో ఉంచుకుని, అతడికి మాత్రమే సూటయ్యేలా రాసిన కథ అని ప్రశాంత్ వెల్లడించాడు.
ఇక సినిమా రిలీజ్ గురించి కూడా ప్రశాంత్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సెప్టెంబరు-అక్టోబరు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నామని.. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నది తమ ప్రణాళిక అని ప్రశాంత్ వెల్లడించాడు. సలార్ సంక్రాంతికి రావొచ్చని కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తుండగా.. ఇప్పుడు స్వయంగా దర్శకుడి నోటి నుంచే ఆ మాట రావడం ప్రభాస్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే.
This post was last modified on February 4, 2021 9:47 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…