థియేటర్లు పునఃప్రారంభమై, బాక్సాఫీస్లో కొంత కళ కనిపించడం ఆలస్యం.. సౌత్ ఇండస్ట్రీ వాళ్లు ఆగట్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలైతే మరీ హడావుడి పడిపోతున్నారు. వరుసబెట్టి కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో కేవలం తెలుగులో మాత్రమే అటు ఇటుగా 30 సినిమాల విడుదల తేదీలు ఖరారవడం విశేషం.
ఇందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ను చూసి కోలీవుడ్ ప్రొడ్యూసర్లలోనూ కదలిక వచ్చింది. మంచి సీజన్లు చూసి తమ సినిమాలకు కర్చీఫ్లు వేసి పెట్టేస్తున్నారు. ఈ ఏడాది వేసవికి, ఆ తర్వాత దసరాకు, ఆపై దీపావళికి దక్షిణాది నుంచి భారీ సినిమాలు విడుదల ఖరారు చేసుకున్నాయి. కాగా 2022 సంక్రాంతి మీద కూడా ఓ భారీ చిత్రం కన్నేసిందన్నది తాజా సమాచారం.
ఇటీవలే మొదలైన ప్రభాస్-ప్రశాంత్ నీల్ల సలార్ సినిమాను 2022 సంక్రాంతి రేసులో నిలబెట్టబోతున్నారట. ప్రభాస్ సినిమా అంటే తెలుగుకు పరిమితం కాదు. దేశమంతా భారీ ఎత్తున విడుదలవుతుంది. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో వసూళ్ల మోత మోగే సీజన్ ఇది. సాధారణంగా ఆ పండక్కి రెండు భాషల్లోనూ రెండు నుంచి నాలుగు చొప్పున సినిమాలు రిలీజవుతుంటాయి. సలార్ రేసులో నిలిచేట్లయితే ఆ పండుగను టార్గెట్ చేసిన వేరే భారీ చిత్రాలకు కష్టమే.
అయితే ఈ ఏడాది దసరా, దీపావళికి ఆల్రెడీలు ఆర్ఆర్ఆర్, అన్నాత్తె ఖరారయ్యాయి. ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే వేగంగానే ఈ సినిమా పూర్తి కానుందట కానీ ఈ ఏడాదిలోనే పూర్తి చేసి రిలీజ్ చేయడమంటే కష్టమే. అందుకే 2022ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధత లేకుండా చాలా ముందుగానే డేట్ ఇచ్చేయనున్నారట. త్వరలోనే ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.
This post was last modified on January 26, 2021 8:31 am
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…