థియేటర్లు పునఃప్రారంభమై, బాక్సాఫీస్లో కొంత కళ కనిపించడం ఆలస్యం.. సౌత్ ఇండస్ట్రీ వాళ్లు ఆగట్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలైతే మరీ హడావుడి పడిపోతున్నారు. వరుసబెట్టి కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో కేవలం తెలుగులో మాత్రమే అటు ఇటుగా 30 సినిమాల విడుదల తేదీలు ఖరారవడం విశేషం.
ఇందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ను చూసి కోలీవుడ్ ప్రొడ్యూసర్లలోనూ కదలిక వచ్చింది. మంచి సీజన్లు చూసి తమ సినిమాలకు కర్చీఫ్లు వేసి పెట్టేస్తున్నారు. ఈ ఏడాది వేసవికి, ఆ తర్వాత దసరాకు, ఆపై దీపావళికి దక్షిణాది నుంచి భారీ సినిమాలు విడుదల ఖరారు చేసుకున్నాయి. కాగా 2022 సంక్రాంతి మీద కూడా ఓ భారీ చిత్రం కన్నేసిందన్నది తాజా సమాచారం.
ఇటీవలే మొదలైన ప్రభాస్-ప్రశాంత్ నీల్ల సలార్ సినిమాను 2022 సంక్రాంతి రేసులో నిలబెట్టబోతున్నారట. ప్రభాస్ సినిమా అంటే తెలుగుకు పరిమితం కాదు. దేశమంతా భారీ ఎత్తున విడుదలవుతుంది. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో వసూళ్ల మోత మోగే సీజన్ ఇది. సాధారణంగా ఆ పండక్కి రెండు భాషల్లోనూ రెండు నుంచి నాలుగు చొప్పున సినిమాలు రిలీజవుతుంటాయి. సలార్ రేసులో నిలిచేట్లయితే ఆ పండుగను టార్గెట్ చేసిన వేరే భారీ చిత్రాలకు కష్టమే.
అయితే ఈ ఏడాది దసరా, దీపావళికి ఆల్రెడీలు ఆర్ఆర్ఆర్, అన్నాత్తె ఖరారయ్యాయి. ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే వేగంగానే ఈ సినిమా పూర్తి కానుందట కానీ ఈ ఏడాదిలోనే పూర్తి చేసి రిలీజ్ చేయడమంటే కష్టమే. అందుకే 2022ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధత లేకుండా చాలా ముందుగానే డేట్ ఇచ్చేయనున్నారట. త్వరలోనే ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.
This post was last modified on January 26, 2021 8:31 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…