థియేటర్లు పునఃప్రారంభమై, బాక్సాఫీస్లో కొంత కళ కనిపించడం ఆలస్యం.. సౌత్ ఇండస్ట్రీ వాళ్లు ఆగట్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలైతే మరీ హడావుడి పడిపోతున్నారు. వరుసబెట్టి కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో కేవలం తెలుగులో మాత్రమే అటు ఇటుగా 30 సినిమాల విడుదల తేదీలు ఖరారవడం విశేషం.
ఇందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ను చూసి కోలీవుడ్ ప్రొడ్యూసర్లలోనూ కదలిక వచ్చింది. మంచి సీజన్లు చూసి తమ సినిమాలకు కర్చీఫ్లు వేసి పెట్టేస్తున్నారు. ఈ ఏడాది వేసవికి, ఆ తర్వాత దసరాకు, ఆపై దీపావళికి దక్షిణాది నుంచి భారీ సినిమాలు విడుదల ఖరారు చేసుకున్నాయి. కాగా 2022 సంక్రాంతి మీద కూడా ఓ భారీ చిత్రం కన్నేసిందన్నది తాజా సమాచారం.
ఇటీవలే మొదలైన ప్రభాస్-ప్రశాంత్ నీల్ల సలార్ సినిమాను 2022 సంక్రాంతి రేసులో నిలబెట్టబోతున్నారట. ప్రభాస్ సినిమా అంటే తెలుగుకు పరిమితం కాదు. దేశమంతా భారీ ఎత్తున విడుదలవుతుంది. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో వసూళ్ల మోత మోగే సీజన్ ఇది. సాధారణంగా ఆ పండక్కి రెండు భాషల్లోనూ రెండు నుంచి నాలుగు చొప్పున సినిమాలు రిలీజవుతుంటాయి. సలార్ రేసులో నిలిచేట్లయితే ఆ పండుగను టార్గెట్ చేసిన వేరే భారీ చిత్రాలకు కష్టమే.
అయితే ఈ ఏడాది దసరా, దీపావళికి ఆల్రెడీలు ఆర్ఆర్ఆర్, అన్నాత్తె ఖరారయ్యాయి. ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే వేగంగానే ఈ సినిమా పూర్తి కానుందట కానీ ఈ ఏడాదిలోనే పూర్తి చేసి రిలీజ్ చేయడమంటే కష్టమే. అందుకే 2022ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధత లేకుండా చాలా ముందుగానే డేట్ ఇచ్చేయనున్నారట. త్వరలోనే ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.
This post was last modified on January 26, 2021 8:31 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…