రెండేళ్ల కిందట హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం.. అందాదున్. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. బతుకు తెరువు కోసం అంధుడిగా నటించే ఓ కుర్రాడు.. తన కళ్ల ముందు ఓ హత్య జరిగితే ఎలా స్పందించాడనే కథాంశంతో చాలా ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం. వేరే ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం దక్షిణాదిన మూడు భాషల్లో రీమేక్ అవుతుండటం విశేషం.
ఇప్పటికే తెలుగులో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో మేర్లపాక గాంధీ అందాదున్ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ప్రశాంత్ హీరోగా ఈ సినిమా పునర్నిర్మితం అవుతోంది. టబు పాత్రను అక్కడ సిమ్రాన్ చేస్తోంది. ఇప్పుడు మలయాళంలో కూడా అందాదున్ రీమేక్ ఖరారైంది.
మాలీవుడ్లో అందాదున్ రీమేక్లో ఓ పెద్ద హీరోనే నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. అతడికి జోడీగా హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రలో రాశి ఖన్నా కనిపించబోతుండటం విశేషం. ఈ ఉత్తరాది భామ ముందు తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయింది. ఈ మధ్య ఇక్కడ ఆమె జోరు తగ్గింది.
తమిళంలో మూణ్నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న రాశి.. ఇప్పుడు మలయాళంలోకి కూడా అడుగు పెట్టేస్తోంది. పృథ్వీరాజ్ లాంటి పెద్ద హీరోతో, అందాదున్ లాంటి సూపర్ హిట్ రీమేక్లో నటించడం అంటే రాశికి బంపరాఫర్ తగిలినట్లే. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి.కె.చంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందించనుండటం విశేషం. చూస్తుంటే ఈ ఏడాదే అందాదున్ మూడు రీమేక్లు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి.
This post was last modified on January 24, 2021 10:48 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…