రెండేళ్ల కిందట హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం.. అందాదున్. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. బతుకు తెరువు కోసం అంధుడిగా నటించే ఓ కుర్రాడు.. తన కళ్ల ముందు ఓ హత్య జరిగితే ఎలా స్పందించాడనే కథాంశంతో చాలా ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం. వేరే ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం దక్షిణాదిన మూడు భాషల్లో రీమేక్ అవుతుండటం విశేషం.
ఇప్పటికే తెలుగులో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో మేర్లపాక గాంధీ అందాదున్ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ప్రశాంత్ హీరోగా ఈ సినిమా పునర్నిర్మితం అవుతోంది. టబు పాత్రను అక్కడ సిమ్రాన్ చేస్తోంది. ఇప్పుడు మలయాళంలో కూడా అందాదున్ రీమేక్ ఖరారైంది.
మాలీవుడ్లో అందాదున్ రీమేక్లో ఓ పెద్ద హీరోనే నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. అతడికి జోడీగా హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రలో రాశి ఖన్నా కనిపించబోతుండటం విశేషం. ఈ ఉత్తరాది భామ ముందు తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయింది. ఈ మధ్య ఇక్కడ ఆమె జోరు తగ్గింది.
తమిళంలో మూణ్నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న రాశి.. ఇప్పుడు మలయాళంలోకి కూడా అడుగు పెట్టేస్తోంది. పృథ్వీరాజ్ లాంటి పెద్ద హీరోతో, అందాదున్ లాంటి సూపర్ హిట్ రీమేక్లో నటించడం అంటే రాశికి బంపరాఫర్ తగిలినట్లే. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి.కె.చంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందించనుండటం విశేషం. చూస్తుంటే ఈ ఏడాదే అందాదున్ మూడు రీమేక్లు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి.
This post was last modified on January 24, 2021 10:48 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…