చడీచప్పుడు లేకుండా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా సెట్ చేసేశాడు ప్రభాస్. వీరి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఊహల్లో అభిమానులు ఉండగానే.. ఆ కాంబినేషన్ ఓకే అయిపోయింది. ‘సలార్’ పేరుతో ఇద్దరూ సినిమా చేయనున్నట్లు రెండు నెలల కిందటే ప్రకటించారు. ఈ మధ్యే ఆ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. నెలాఖర్లో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రధాన తారాగణం గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. విలన్గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓకే అయ్యాడని.. హీరోయిన్గా దిశా పఠానిని ఖరారు చేశారని.. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్లో క్రేజ్ కోసం వారిద్దరినీ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు దానికి భిన్నమైన ప్రచారం నడుస్తోంది.
ప్రభాస్ సరసన కథానాయికగా స్టార్ హీరోయిన్ ఎవరినీ తీసుకోలేదని, ఒక కొత్తమ్మాయి అతడితో రొమాన్స్ చేయనుందని తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి తోడు ‘సలార్’ విలన్గా కొత్త పేరు వినిపిస్తోంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ‘సలార్’ విలన్గా ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మరి జాన్తో పాటు సేతుపతి కూడా ఈ చిత్రంలో ఉంటాడా లేక జాన్ స్థానంలో అతణ్ని తీసుకున్నారా అన్నది తెలియదు.
జాన్ అబ్రహాం విలన్ అయితే ఉత్తరాదిన ఈ సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుంది. సేతుపతి కనిపిస్తే సౌత్లో ఈ సినిమాకు వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఇటీవల ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి విజయ్ను ఢీకొనడం వల్ల ఆ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. సినిమా అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సేతుపతి భలేగా హైలైట్ అయ్యాడు. అలాంటిది ‘సలార్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్ను సేతుపతి ఢీకొడితే దానికొచ్చే క్రేజే వేరుంటుంది.
This post was last modified on January 23, 2021 4:05 pm
కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే ప్రేక్షకులకే…
కింగ్ అఫ్ కంటెంట్ లేదా ఎంటర్ టైన్మెంట్ అని వినడానికి బాగానే ఉంది కానీ హీరో విష్ణు తన ఎంపికను…
దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత…
తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు…
తెలివి ఎవరి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత కష్టమైన పనైనా సులువుగా మారిపోవడంతోపాటు సులువుగా మార్చుకోవడానికి కూడా అవకాశం…
భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం…