చడీచప్పుడు లేకుండా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా సెట్ చేసేశాడు ప్రభాస్. వీరి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఊహల్లో అభిమానులు ఉండగానే.. ఆ కాంబినేషన్ ఓకే అయిపోయింది. ‘సలార్’ పేరుతో ఇద్దరూ సినిమా చేయనున్నట్లు రెండు నెలల కిందటే ప్రకటించారు. ఈ మధ్యే ఆ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. నెలాఖర్లో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రధాన తారాగణం గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. విలన్గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓకే అయ్యాడని.. హీరోయిన్గా దిశా పఠానిని ఖరారు చేశారని.. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్లో క్రేజ్ కోసం వారిద్దరినీ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు దానికి భిన్నమైన ప్రచారం నడుస్తోంది.
ప్రభాస్ సరసన కథానాయికగా స్టార్ హీరోయిన్ ఎవరినీ తీసుకోలేదని, ఒక కొత్తమ్మాయి అతడితో రొమాన్స్ చేయనుందని తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి తోడు ‘సలార్’ విలన్గా కొత్త పేరు వినిపిస్తోంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ‘సలార్’ విలన్గా ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మరి జాన్తో పాటు సేతుపతి కూడా ఈ చిత్రంలో ఉంటాడా లేక జాన్ స్థానంలో అతణ్ని తీసుకున్నారా అన్నది తెలియదు.
జాన్ అబ్రహాం విలన్ అయితే ఉత్తరాదిన ఈ సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుంది. సేతుపతి కనిపిస్తే సౌత్లో ఈ సినిమాకు వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఇటీవల ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి విజయ్ను ఢీకొనడం వల్ల ఆ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. సినిమా అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సేతుపతి భలేగా హైలైట్ అయ్యాడు. అలాంటిది ‘సలార్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్ను సేతుపతి ఢీకొడితే దానికొచ్చే క్రేజే వేరుంటుంది.
This post was last modified on January 23, 2021 4:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…