చడీచప్పుడు లేకుండా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సినిమా సెట్ చేసేశాడు ప్రభాస్. వీరి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఊహల్లో అభిమానులు ఉండగానే.. ఆ కాంబినేషన్ ఓకే అయిపోయింది. ‘సలార్’ పేరుతో ఇద్దరూ సినిమా చేయనున్నట్లు రెండు నెలల కిందటే ప్రకటించారు. ఈ మధ్యే ఆ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. నెలాఖర్లో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రధాన తారాగణం గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. విలన్గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓకే అయ్యాడని.. హీరోయిన్గా దిశా పఠానిని ఖరారు చేశారని.. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్లో క్రేజ్ కోసం వారిద్దరినీ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు దానికి భిన్నమైన ప్రచారం నడుస్తోంది.
ప్రభాస్ సరసన కథానాయికగా స్టార్ హీరోయిన్ ఎవరినీ తీసుకోలేదని, ఒక కొత్తమ్మాయి అతడితో రొమాన్స్ చేయనుందని తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి తోడు ‘సలార్’ విలన్గా కొత్త పేరు వినిపిస్తోంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ‘సలార్’ విలన్గా ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మరి జాన్తో పాటు సేతుపతి కూడా ఈ చిత్రంలో ఉంటాడా లేక జాన్ స్థానంలో అతణ్ని తీసుకున్నారా అన్నది తెలియదు.
జాన్ అబ్రహాం విలన్ అయితే ఉత్తరాదిన ఈ సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుంది. సేతుపతి కనిపిస్తే సౌత్లో ఈ సినిమాకు వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఇటీవల ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి విజయ్ను ఢీకొనడం వల్ల ఆ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. సినిమా అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సేతుపతి భలేగా హైలైట్ అయ్యాడు. అలాంటిది ‘సలార్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్ను సేతుపతి ఢీకొడితే దానికొచ్చే క్రేజే వేరుంటుంది.
This post was last modified on January 23, 2021 4:05 pm
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…
ఒక్కొక్కసారి కొన్నికొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. అలా పట్టించుకుంటే.. మనకేదో మేలు జరుగుతుందని అనుకుంటే.. అదే పెద్ద తప్పిదం అయి…
మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్'…
ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాతతరానికి చెందిన నాయకులు.. ఒక కులాన్ని ప్రభావితం చేస్తారని భావించే నాయకులు ముఖ్యంగా…
మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు…