జనవరి 21.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పుట్టిన రోజు. మామూలుగా అయితే అతను ఈపాటికి అభిమానులతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జన్మదిన వేడుకలు చేసుకోవాల్సింది. కానీ అభిమానులకు కన్నీళ్లు మిగిల్చి.. పుట్టిన రోజు నాడు అతడి జ్ఞాపకాలను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకునేలా చేుశాడు.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగు పెట్టి కై పో చే, శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ లవ్ స్టోరీ, చిచ్చోరే లాంటి సినిమాలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ యువ నటుడు.. ఇంత మంచి కెరీర్ను వదులుకుని, ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడని ఎవరూ అనుకోలేదు. గత ఏడాది జూన్ 14న అతను ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులను విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
సుశాంత్ ఎందుకు చనిపోయాడనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ముందు అతడిని అనుమానాస్పద మృతిగానే భావించినప్పటికీ.. చివరికి పోలీసులేమో అది ఆత్మహత్యగానే నిర్ధరించారు. ఈ కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. కానీ కొత్త విషయాలేమీ వెలుగులోకి రాలేదు. ఎంత పెద్ద ఉదంతం జరిగినా కొంత కాలమే ఆ వేడి ఉంటుంది. ఆ తర్వాత అందరూ దాన్ని మరిచిపోతారు. సుశాంత్ వ్యవహారం కూడా అలాగే తయారైంది.
ఐతే ఈ రోజు సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద జనాల్లో ఎంత అభిమానం ఉందన్నది సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ‘సుశాంత్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి లక్షలాది మంది స్పందిస్తున్నారు. అతడి సినిమాల జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్ ఫొటోలు, వీడియోలు, వివిధ సందర్భాల్లో అతడి వ్యాఖ్యలు, డైరీలో రాసుకున్న మాటలు.. ఇవన్నీ ప్రస్తావిస్తూ హృద్యమైన పోస్టులు పెడుతున్నారు. సుశాంత్ అభిమానులకు ఇవి చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు. సుశాంత్ ఎందుకిలా చేశాడో అని మరోసారి మథనపడుతున్నారు.
This post was last modified on January 21, 2021 4:12 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…