జనవరి 21.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పుట్టిన రోజు. మామూలుగా అయితే అతను ఈపాటికి అభిమానులతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జన్మదిన వేడుకలు చేసుకోవాల్సింది. కానీ అభిమానులకు కన్నీళ్లు మిగిల్చి.. పుట్టిన రోజు నాడు అతడి జ్ఞాపకాలను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకునేలా చేుశాడు.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగు పెట్టి కై పో చే, శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ లవ్ స్టోరీ, చిచ్చోరే లాంటి సినిమాలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ యువ నటుడు.. ఇంత మంచి కెరీర్ను వదులుకుని, ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడని ఎవరూ అనుకోలేదు. గత ఏడాది జూన్ 14న అతను ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులను విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
సుశాంత్ ఎందుకు చనిపోయాడనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ముందు అతడిని అనుమానాస్పద మృతిగానే భావించినప్పటికీ.. చివరికి పోలీసులేమో అది ఆత్మహత్యగానే నిర్ధరించారు. ఈ కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. కానీ కొత్త విషయాలేమీ వెలుగులోకి రాలేదు. ఎంత పెద్ద ఉదంతం జరిగినా కొంత కాలమే ఆ వేడి ఉంటుంది. ఆ తర్వాత అందరూ దాన్ని మరిచిపోతారు. సుశాంత్ వ్యవహారం కూడా అలాగే తయారైంది.
ఐతే ఈ రోజు సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద జనాల్లో ఎంత అభిమానం ఉందన్నది సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ‘సుశాంత్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి లక్షలాది మంది స్పందిస్తున్నారు. అతడి సినిమాల జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్ ఫొటోలు, వీడియోలు, వివిధ సందర్భాల్లో అతడి వ్యాఖ్యలు, డైరీలో రాసుకున్న మాటలు.. ఇవన్నీ ప్రస్తావిస్తూ హృద్యమైన పోస్టులు పెడుతున్నారు. సుశాంత్ అభిమానులకు ఇవి చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు. సుశాంత్ ఎందుకిలా చేశాడో అని మరోసారి మథనపడుతున్నారు.
This post was last modified on January 21, 2021 4:12 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…