లాక్ డౌన్ నెమ్మదిగా ఎత్తేస్తున్నారు కానీ కరోనా సమస్య అయితే ఇంకా తీరలేదనేది స్పష్టంగా తెలుసు. షూటింగ్స్ కి కూడా జూన్ నుంచి పర్మిషన్ వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారట. దీంతో నిర్మాతలు ఊరట చెందుతున్నారు. అయితే సినిమా షూటింగ్స్ లో సామజిక దూరం పాటించడం కష్టం.
ముఖ్యంగా నటీనటులు మేకప్ కోసం, ఇతర అవసరాల కోసం వెంట సహాయకులు ఉండాలి. వాళ్ళు వీరిని తాకుతూ ఉంటారు. అలాగే షూటింగ్ లో సాటి నటీనటులతో సన్నిహితంగా ఉండాల్సిన సన్నివేశాలుంటాయి. కెమెరా సిబ్బందికి, దర్శకత్వ శాఖకి కూడా సామజిక దూరం పాటించే సౌకర్యం ఉండదు. దీంతో ప్రముఖ నటీనటులు ఇంకా కరోనా బూచి భయం పోకముందే షూటింగ్స్ అంటే జంకుతున్నారట.
అది ఒకరికి సోకితే ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా సమస్యే కనుక ఇరవై మందికి మించి సిబ్బంది అవసరం లేని టీవీ షోస్, చిన్న సినిమాల షూటింగ్స్ మాత్రం మొదలు కావచ్చునని భావిస్తున్నారు. మళ్ళీ తెలుగు సినిమా యధావిధిగా రన్నింగ్ లో పడడానికి మాత్రం మరి కొన్నాళ్ళు ఆగాలంటున్నారు.
This post was last modified on May 5, 2020 8:07 pm
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…