లాక్ డౌన్ నెమ్మదిగా ఎత్తేస్తున్నారు కానీ కరోనా సమస్య అయితే ఇంకా తీరలేదనేది స్పష్టంగా తెలుసు. షూటింగ్స్ కి కూడా జూన్ నుంచి పర్మిషన్ వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారట. దీంతో నిర్మాతలు ఊరట చెందుతున్నారు. అయితే సినిమా షూటింగ్స్ లో సామజిక దూరం పాటించడం కష్టం.
ముఖ్యంగా నటీనటులు మేకప్ కోసం, ఇతర అవసరాల కోసం వెంట సహాయకులు ఉండాలి. వాళ్ళు వీరిని తాకుతూ ఉంటారు. అలాగే షూటింగ్ లో సాటి నటీనటులతో సన్నిహితంగా ఉండాల్సిన సన్నివేశాలుంటాయి. కెమెరా సిబ్బందికి, దర్శకత్వ శాఖకి కూడా సామజిక దూరం పాటించే సౌకర్యం ఉండదు. దీంతో ప్రముఖ నటీనటులు ఇంకా కరోనా బూచి భయం పోకముందే షూటింగ్స్ అంటే జంకుతున్నారట.
అది ఒకరికి సోకితే ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా సమస్యే కనుక ఇరవై మందికి మించి సిబ్బంది అవసరం లేని టీవీ షోస్, చిన్న సినిమాల షూటింగ్స్ మాత్రం మొదలు కావచ్చునని భావిస్తున్నారు. మళ్ళీ తెలుగు సినిమా యధావిధిగా రన్నింగ్ లో పడడానికి మాత్రం మరి కొన్నాళ్ళు ఆగాలంటున్నారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…