లాక్ డౌన్ నెమ్మదిగా ఎత్తేస్తున్నారు కానీ కరోనా సమస్య అయితే ఇంకా తీరలేదనేది స్పష్టంగా తెలుసు. షూటింగ్స్ కి కూడా జూన్ నుంచి పర్మిషన్ వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారట. దీంతో నిర్మాతలు ఊరట చెందుతున్నారు. అయితే సినిమా షూటింగ్స్ లో సామజిక దూరం పాటించడం కష్టం.
ముఖ్యంగా నటీనటులు మేకప్ కోసం, ఇతర అవసరాల కోసం వెంట సహాయకులు ఉండాలి. వాళ్ళు వీరిని తాకుతూ ఉంటారు. అలాగే షూటింగ్ లో సాటి నటీనటులతో సన్నిహితంగా ఉండాల్సిన సన్నివేశాలుంటాయి. కెమెరా సిబ్బందికి, దర్శకత్వ శాఖకి కూడా సామజిక దూరం పాటించే సౌకర్యం ఉండదు. దీంతో ప్రముఖ నటీనటులు ఇంకా కరోనా బూచి భయం పోకముందే షూటింగ్స్ అంటే జంకుతున్నారట.
అది ఒకరికి సోకితే ఇంట్లో కుటుంబ సభ్యులకి కూడా సమస్యే కనుక ఇరవై మందికి మించి సిబ్బంది అవసరం లేని టీవీ షోస్, చిన్న సినిమాల షూటింగ్స్ మాత్రం మొదలు కావచ్చునని భావిస్తున్నారు. మళ్ళీ తెలుగు సినిమా యధావిధిగా రన్నింగ్ లో పడడానికి మాత్రం మరి కొన్నాళ్ళు ఆగాలంటున్నారు.
This post was last modified on May 5, 2020 8:07 pm
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…