గుంటూరు జిల్లాలోని పొన్నూరు మునిసిపాలిటీ రాజకీయం అధికార టీడీపీకి అనుకూలంగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో ఈ స్థానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దాదాపు 32,915 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై ఘన విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం, మునిసిపాలిటీ పరిధిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా ఉంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వివిధ వార్డులు, స్థానిక అభివృద్ధి పనులపై పట్టు సాధించారు.
ఇటీవల పట్టణంలో రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన వంటి పనులపై దృష్టి పెట్టారు. దీనికితోడు కార్యకర్తలతోనూ కలివిడిగా ఉంటున్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న అంబటి మురళీకృష్ణ డోలాయమానంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు కష్టమన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అయితే.. అంబటి మాత్రం పార్టీ శ్రేణులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని కొన్ని గ్రామాలలో మొక్కజొన్న రైతుల పక్షాన గళం వినిపించారు.
క్షేత్రస్థాయిలో రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది స్థానిక నాయకులు పార్టీలు మారుతున్నారు. ఉదాహరణకు ఇటీవల టీడీపీకి చెందిన మండవ గౌతమ్ వంటి కొందరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. ఈ విషయాన్ని టీడీపీ లైట్ తీసుకుంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో పొన్నూరు మునిసిపాలిటీని దక్కించుకుని తీరుతామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల చెబుతున్నారు. మరోవైపు.. తన వారసురాలిని అరంగేట్రం చేయించేందుకు కూడా చూస్తున్నారు.
ధూళిపాళ్ల వైదీప్తి.. ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే.. కొన్నాళ్ల కిందట జరిగిన ఓ ఫంక్షన్కు హాజరైన మంత్రి లోకేష్.. వైదీప్తికి ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. వచ్చే ఎన్నికల వరకు కాకుండా.. మునిసిపల్ ఎన్నికల్లో నే దీప్తిని రంగంలోకి దింపాలని ధూళిపాళ్ల నిర్ణయించుకున్నట్టు పొన్నూరులో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఏ క్షణమైన టీడీపీ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం నరేంద్ర పోటీ చేస్తారని.. వైదీప్తి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చని.. మునిసిపల్ ఛైర్మన్ పోస్టుపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 19, 2026 8:12 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…