ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల టాక్. 2027 సంక్రాంతి విడుదల టార్గెట్ చేసుకుని జనవరి 13 డేట్ కూడా ప్రకటించిన ‘కాకా’ని దానికి తగ్గట్టే దర్శకుడు బాబీ కొల్లి శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. మెగాస్టార్ సహకారం పూర్తిగా ఉండటంతో ఎక్కడా బ్రేకులు పడటం లేదు. వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేయాలనే సంకల్పంతో ఈ టీమ్ అలుపు లేకుండా కష్టపడుతోంది.
ఇక్కడే ఒక సమస్య వచ్చిందట. రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం వెయిటింగ్ లో ఉన్న ‘విశ్వంభర’ని పండక్కు విడుదల చేస్తే బాగుంటుందనే దిశగా చర్చలు మొదలయ్యాయట. అలా అయితే మంచి ఓటిటి డీల్ దక్కుతుందని వినికిడి. కానీ బాబీ దీనికి ససేమిరా అనొచ్చు. ఎందుకంటే తన టార్గెట్ పట్ల చాలా క్లారిటీతో ఉన్నాడు. కాకాని శిల్పంలా చెక్కుతున్నా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడీ ట్విస్టు రావడం ఎవరూ ఊహించలేదు.
ఎలాగూ జరిగే ఆలస్యం జరిగిపోయింది కాబట్టి విశ్వంభరని 2027 వేసవికి తీసుకెళ్లినా నష్టం లేదనే కోణంలో ఆర్గుమెంట్ జరుగుతోందిట. అలా అయితే దాని ఓటిటి ఏ జూలైలోనూ ఆగస్ట్ లోనో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సదరు డిజిటల్ కంపెనీ ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడు బంతి చిరంజీవి కోర్టులో ఉంది. ఆయన మాటే ఫైనల్ కాని బాబీ కష్టాన్ని కళ్లారా చూస్తూ కఠినమైన నిర్ణయం తీసుకుంటారానే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరగా ఇది తేలాలి.
ఇదంతా బాగానే ఉంది కానీ విశ్వంభర లాంటి విజువల్ గ్రాండియర్ కి కంటెంట్ పరంగా పోటీ ఉండకూడదు. కానీ ప్రశాంత్ వర్మ నిర్మాణంలో రూపొందిన మహాకాళి ఇదే జానర్ లో వస్తోంది. అందరి కంటే ముందు జనవరి 8 ఆల్రెడీ వేసుకున్నారు కూడా. సో పోలికలు లాంటివి వచ్చే అవకాశాలు లేకపోలేదు. రెండింటి స్థాయి ఒకటే కాకపోయినా కంటెంట్ మాట్లాడే రోజుల్లో కంపారిజన్లు తప్పడం లేదు. చూడాలి మరి పండక్కు కాకా వస్తాడో లేక విశ్వంభర సై అంటాడో వెయిట్ అండ్ సీ.
This post was last modified on September 12, 2026 10:37 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…