నిన్న విడుదలైన యెషనాగుల కట్ట మీద పాట సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఇతర స్టార్ హీరోల అభిమానులు తమకిష్టమైన పాటలకు ఆ సాంగ్ జోడించి ఎడిట్స్ చేయడం తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి దగ్గర నుంచి పక్క రాష్ట్రం శివ కార్తికేయన్ వరకు ఎవరిని వదలకుండా దీని కోసం వాడేస్తున్నారు. ఒరిజినల్ రిలీజ్ కన్నా ముందే ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడం ది ప్యారడైజ్ బృందానికి చాలా ప్లస్ అయ్యింది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
నాని, కీర్తి స్టెప్పులకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. చాలా మంది గుంటూరు కారం రేంజ్ లో ఊహించుకున్నారు కానీ శ్రీలీల ఎనర్జీని కీర్తి సురేష్ తో పోల్చడం సరికాదు కాబట్టి, విడిగా చూసుకుంటే పాటకు ఆట సందీప్ కంపోజ్ చేసిన నృత్యాలు స్లో పాయిజన్ అయ్యేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించాలి. సెప్టెంబర్ 24 ‘ప్యారడైజ్’ విడుదల కాగా సెప్టెంబర్ 25 తమిళ మూవీ ‘డోరోతి’ రిలీజ్ కానుంది. ఇందులో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్.
నిన్న యెషనాగుల పాట వచ్చిన కొన్ని గంటలకే డొరోతి నుంచి ఇళయరాజా స్వరపరిచిన ‘మత్తుమణి’ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మిలియన్నర వ్యూస్ తెచ్చేసుకుంది. ఇది ఫాస్ట్ బీట్ సాంగ్ కాదు. మంచి మెలోడీ. యెష నాగుల కట్టలో కీర్తి సురేష్ హుషారుగా ఆడిపాడితే డొరొతీలో పద్ధతైన చీరకట్టులో గ్రామ్ ఫోన్ రికార్డు దగ్గర కూర్చుని రాజా మాయాజాలంలో తేలడం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్యారడైజ్ ఊర మాస్ అయితే డొరొతీ అల్ట్రా క్లాస్ గా నిలిచింది.
రెండింటిలోనూ కీర్తి సురేష్ ఉండటంతో ఈ పోలిక తేవాల్సి వచ్చింది. కాకతాళీయంగా రెండు ఒకే రోజు గ్యాప్ తో రిలీజ్ కానుండటం గమనార్హం. అయితే ప్యారడైజ్ లో తను మెయిన్ లీడ్ కాకపోయినా మాస్ ఆడియన్స్ పరంగా ఎక్కువ ఫుల్ ఇచ్చే పాటలో నటించింది కాబట్టి తను కూడా హైలైట్ అవుతోంది. ఇక డోరోతి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఇప్పటికే ఈ మూవీ పలు ఇంటర్నేషనల్ అవార్డులు దక్కించుకుంది. కమర్షియల్ గా సక్సెసవుతుందన్న నమ్మకంతో తమిళ తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
