ఏళ్లకేళ్లు ఎదురు చూస్తున్న విశ్వంభర అక్టోబర్ లో వచ్చే అవకాశాలు దాదాపు సున్నా. ఇది తెలిసే మైత్రి సంస్థ రణబాలిని దసరా పండక్కు లాక్ చేసుకుంది. పోటీలో రజనీకాంత్ జైలర్ 2 ఉన్నా సరే వెనక్కు తగ్గనంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది. మరి విశ్వంభర ఎప్పుడనే ప్రశ్నకు సమాధానం దొరకాలి. అంతర్గత సమాచారం ప్రకారం అన్ని అనుకున్న టైంకు కనక పూర్తయితే డిసెంబర్ ఆప్షన్ వైపు యువి క్రియేషన్స్ సీరియస్ గా చూస్తోందట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
జనవరి 13 కాకా వస్తోంది. అంటే కేవలం నెల రోజుల కంటే తక్కువ గ్యాప్ లో రెండు మెగాస్టార్ సినిమాలు రావడం ఇప్పుడున్న బాక్సాఫీస్ పరిస్థితిలో అంత సేఫ్ కాదు. కానీ వేరే ఆప్షన్ లేనప్పుడు తప్పదనిపించినా ఫ్యాన్స్ మాత్రం 2027 సమ్మర్ కు వెళ్లిపోవడం బెటరని ఫీలవుతున్నారు. ఒకప్పుడు అంటే నలభై సంవత్సరాల క్రితం చిరంజీవి యూత్ గా ఉన్న టైంలో నెలకో రిలీజు ఉండేవి. కృష్ణని ఫాలో అవుతూ యమబిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడా సిచువేషన్ ఏ హీరోకి లేదు.
అసలే డిసెంబర్ లో ఫౌజీ, బాలయ్య 111, కింగ్ 100, షారుఖ్ కింగ్ తో పాటు హాలీవుడ్ మూవీ ఎవెంజర్స్ డూమ్స్ డే కాచుకుని ఉన్నాయి. వీటిలో ఏవి తప్పుకుంటాయో ఇంకా ఫైనల్ కాలేదు. విశ్వంభరని అదే నెలలో పంపాలనుకుంటే ఎక్కడ పోటీ ఉండదో చెక్ చేసుకుని చూడాలి, లేదంటే థియేటర్ల పంపకాల నుంచి రకరకాల విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. నవంబర్ అనువైన సీజన్ కాకపోవడంతో నిర్మాతలెవరూ ఆ మంత్ మీద ఆసక్తి చూపించడం లేదు.
రిలీజ్ సంగతి ఎలా ఉన్నా ముందైతే విశ్వంభర ఇప్పటికే జీరో అయిపోయిన హైప్ తిరిగి సృష్టించడం ఎలాగో ప్లాన్ చేసుకోవాలి. దానికి సరైన మార్గం ట్రైలర్. ఇంకా సిజి వర్క్స్ చేతికి రావాల్సి ఉందని వినికిడి. అవి వచ్చాక, చిరంజీవి మెచ్చుకున్నాక, ఇంక ముందుకు వెళ్లొచ్చు అని అభయం దొరికిన తర్వాత తప్ప అంతకన్నా ముందు ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు. వసిష్ఠ దర్శకత్వం వహించిన విశ్వంభరకు కీరవాణితో పాటు భీమ్స్, గౌరా హరి సంగీతానికి పని చేశారు.
This post was last modified on August 27, 2026 2:54 pm
దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను వచ్చే 25 ఏళ్ల…
రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్లో గతానికి భిన్నమైన `వ్యక్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇందిరమ్మ హయాంలో…
కీలకమైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల తరబడి సాగుతున్న ప్రాజెక్టులనే…
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా…
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…
దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…