మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని డిజాస్టర్లు అయ్యాయి. కొన్ని చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ ఏదీ ఆయనకు ఆనందాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. ఐతే ఇన్నేళ్ల కరువు తీర్చేస్తూ మాస్ రాజా కొత్త సినిమా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. కేవలం రెండో రోజే బ్రేక్ ఈవెన్ అందుకున్న ఈ చిత్రం.. ఆదివారం కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఈ చిత్రం మీద పెట్టుబడి పెట్టిన అందరూ భారీ లాభాలు అందుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే అందరికంటే ఎక్కువ లాభం రవితేజకే అన్నది యూనిట్ వర్గాల సమాచారం. గత కొన్నేళ్లలో రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తినడంతో ఆయన పారితోషకం తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కొందరు హీరోలు అనుసరిస్తున్నట్లు లాభాల్లో వాటా తీసుకోవడం, ఏరియాల రైట్స్ తీసుకోవడం లాంటి మోడల్ వైపు కూడా ఆయన మళ్లాల్సి వచ్చింది.
ఇందులో భాగంగానే ‘ఇరుముడి’కి రవితేజ రిలీజ్ ముంగిట పారితోషకం అంటూ ఏమీ తీసుకోలేదు. కొంత మేర లాభాల్లో పర్సంటేజీ తీసుకోవడంతో పాటు నైజాం ఏరియా హక్కులను తీసుకున్నారు. రిలీజ్ ముంగిట ‘ఇరుముడి’ థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.7 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు చూస్తే ఆ మార్కును రెండో రోజే దాటేసింది ‘ఇరుముడి’. ఫుల్ రన్లో ఈ సినిమా నైజాంలో రూ.25 కోట్లకు తక్కువ కాకుండా షేర్ రాబట్టేలా కనిపిస్తోంది.
మరోవైపు లాభాల్లో వాటా కింద కూడా రవితేజ మంచి మొత్తమే అందుకోబోతున్నారు. ఇలా మొత్తంగా ఆయనకు ‘ఇరుముడి’తో రూ.25 కోట్ల దాకా వర్కవుట్ కావచ్చని భావిస్తున్నారు. తన మార్కెట్ దెబ్బ తిన్న దృష్ట్యా పారితోషకం అడిగి ఉంటే రూ.15 కోట్లకు అటు ఇటుగా దక్కేదేమో. కానీ లాభాల్లో వాటా, ఏరియా హక్కులు తీసుకోవడం వల్ల ఊహించని స్థాయిలో ఆదాయం అందుకుంటున్నాడు మాస్ రాజా. ఈ మోడల్ చూసి మిగతా హీరోలు కూడా టెంప్ట్ కావచ్చు కానీ.. అన్నిసార్లూ ఇలాంటి మ్యాజిక్స్ జరగవు. ‘ఇరుముడి’ తీసిన మైత్రీ సంస్థే నిర్మించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు ఇదే మోడల్ అనుసరించిన రామ్ పోతినేని గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు.
This post was last modified on August 23, 2026 5:05 pm
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…