వెంకీ అట్లూరి.. ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియా అంతటా చర్చనీయాంశం అవుతున్న పేరు. సార్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరుసగా ఘనవిజయాలే కాదు, గొప్ప ప్రశంసలు కూడా అందుకున్నాడు. ముఖ్యంగా ‘లక్కీ భాస్కర్’ దర్శకుడిగా వెంకీని ఎన్నో మెట్లు ఎక్కించగా.. ఇప్పడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫ్యామిలీ మూవీతో వసూళ్ల మోత మోగించడం తన రేంజిని మరింత పెంచింది.
ఇప్పుడు తెలుగులో పెద్ద పెద్ద హీరోలు కూడా తనతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే తన తర్వాతి సినిమా ఎవరితో అన్నది వెంకీ ఇంకా తేల్చలేదు. ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ అంటున్నాడు కానీ.. అది ఇప్పుడే కాదని కూడా చెబుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో వెంకీ మరో ఆసక్తికర విషయం పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో తాను ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు అతను వెల్లడించాడు.
చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇప్పటికే తన వద్దకు వచ్చిందని, కానీ అందుకు టైం పడుతుందని అతను చెప్పాడు. చిరంజీవి తన చిన్ననాటి ఆరాధ్య కథానాయకుడని.. అలాంటి హీరోతో సినిమా అంటే చిన్న విషయం కాదని అతనన్నాడు. ఆ సినిమా ఆషామాషీగా చేయలేమని, ఆయన స్థాయికి తగ్గట్లు గొప్ప కథతోనే సినిమా చేయాలని.. అందుకు సమయం పడుతుందని అన్నాడు. చిరుతో సినిమా చేయాలంటే తనకు కూడా మరింత పరిణతి రావాలని.. కాబట్టి ప్రతి విషయం పకడ్బందీగా ఉండేలా చూసుకుని.. సరైన సమయంలో చిరుతో సినిమా చేస్తానని వెంకీ తెలిపాడు.
ఇక తాను వరుసగా సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే సినిమాలు చేయడం గురించి వెంకీ మాట్లాడుతూ.. ‘రంగ్ దె’ సినిమాతో ఫ్లాప్ ఇచ్చినా సరే నిర్మాత నాగవంశీ తనను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చాడని, ఆ కృతజ్ఞతతోనే ఇప్పడు ఆయన బేనర్లో వరుసగా సినిమాలు చేస్తున్నానని.. ఇక ముందూ ఆయనతో ప్రయాణం కొనసాగుతుందని వెంకీ తెలిపాడు.
This post was last modified on August 18, 2026 1:09 pm
ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…
ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…