పది నెలల కిందటే ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధమైన సినిమా ‘ఉప్పెన’. మెగా ఫ్యామిలీ కొత్త కుర్రాడు, చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గత ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సరిగ్గా అంతకు రెండు వారాల ముందు కరోనా వచ్చి థియేటర్లను మూత వేయించింది. ఇక అప్పట్నుంచి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూసి చూసి అలసిపోయింది ఈ చిత్ర బృందం.
మధ్యలో ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త కుర్రాడిని ఓటీటీల ద్వారా అరంగేట్రం చేయించడం సరి కాదని మైత్రీ మూవీ మేకర్స్ స్థిరంగా ఓ నిర్ణయంతో ఉండిపోయింది. డిసెంబర్లో థియేటర్లు పున:ప్రారంభమైనా.. వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అని ఆగారు. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడిక ఒక మంచి ముహూర్తం చూసి సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం.
‘ఉప్పెన’ పూర్తి స్థాయి ప్రేమ కథ కావడంతో వేలంటైన్స్ డే సీజన్లో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. వేసవికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోవడం, అక్కడ పోటీ తీవ్రంగా ఉండటంతో మధ్యే మార్గంలో ఫిబ్రవరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో సినిమాలు సరిగా ఆడవు కానీ.. ఫిబ్రవరి కొంచెం నయమే. ఈ నెలలోనే ‘నేను లోకల్’ లాంటి బ్లాక్బస్టర్, ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్ వచ్చాయి.
సంక్రాంతితో పోలిస్తే వసూళ్లు తగ్గుతాయి కానీ.. పరిస్థితి మరీ ఇబ్బందికరంగా అయితే ఉండదు. ఫిబ్రవరి 5కే ‘జాంబీరెడ్డి’ సినిమా కూడా ఫిక్స్ అయినప్పటికీ దాంతో పోలిస్తే జానర్ పూర్తి భిన్నం కావడం, ఇలాంటి రెండు చిన్న సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర స్కోప్ ఉండటంతో ‘ఉప్పెన’ను అదే డేట్కు ఖాయం చేశారట. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి అనే కొత్తమ్మాయే కథానాయికగా నటించింది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…