పది నెలల కిందటే ఫస్ట్ కాపీతో విడుదలకు సిద్ధమైన సినిమా ‘ఉప్పెన’. మెగా ఫ్యామిలీ కొత్త కుర్రాడు, చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గత ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సరిగ్గా అంతకు రెండు వారాల ముందు కరోనా వచ్చి థియేటర్లను మూత వేయించింది. ఇక అప్పట్నుంచి థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూసి చూసి అలసిపోయింది ఈ చిత్ర బృందం.
మధ్యలో ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త కుర్రాడిని ఓటీటీల ద్వారా అరంగేట్రం చేయించడం సరి కాదని మైత్రీ మూవీ మేకర్స్ స్థిరంగా ఓ నిర్ణయంతో ఉండిపోయింది. డిసెంబర్లో థియేటర్లు పున:ప్రారంభమైనా.. వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అని ఆగారు. సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడిక ఒక మంచి ముహూర్తం చూసి సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం.
‘ఉప్పెన’ పూర్తి స్థాయి ప్రేమ కథ కావడంతో వేలంటైన్స్ డే సీజన్లో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. వేసవికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోవడం, అక్కడ పోటీ తీవ్రంగా ఉండటంతో మధ్యే మార్గంలో ఫిబ్రవరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో సినిమాలు సరిగా ఆడవు కానీ.. ఫిబ్రవరి కొంచెం నయమే. ఈ నెలలోనే ‘నేను లోకల్’ లాంటి బ్లాక్బస్టర్, ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్ వచ్చాయి.
సంక్రాంతితో పోలిస్తే వసూళ్లు తగ్గుతాయి కానీ.. పరిస్థితి మరీ ఇబ్బందికరంగా అయితే ఉండదు. ఫిబ్రవరి 5కే ‘జాంబీరెడ్డి’ సినిమా కూడా ఫిక్స్ అయినప్పటికీ దాంతో పోలిస్తే జానర్ పూర్తి భిన్నం కావడం, ఇలాంటి రెండు చిన్న సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర స్కోప్ ఉండటంతో ‘ఉప్పెన’ను అదే డేట్కు ఖాయం చేశారట. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి శెట్టి అనే కొత్తమ్మాయే కథానాయికగా నటించింది.
This post was last modified on January 13, 2021 11:00 am
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…