పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఈ మధ్యే ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్. ఇందులో హీరోలిద్దరికీ జోడీలు కూడా ఉంటాయి. కాకపోతే రానా చేస్తున్న పాత్ర పక్కన నటించాల్సిన అమ్మాయి పాత్రకు ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ సరసన చేయబోయే పాత్ర మాత్రం సినిమాలో కొంచెం కీలకంగానే ఉంటుంది. ఒరిజినల్లో పెద్దగా పేరులేని కొత్త అమ్మాయి ఆ పాత్రను చేసింది.
బిజు మీనన్ పక్కన కాబట్టి ఎవరైనా ఓకే. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన అంటే స్టేచర్ ఉన్న హీరోయిన్నే పెట్టాలి. అదే సమయంలో ఆ పాత్రను సమర్థంగా పోషించే నైపుణ్యం ఉన్న నటి కావాలి. ఆ లక్షణాలు సాయిపల్లవిలో ఉన్నాయని భావించి ఆమెనే చిత్ర బృందం సంప్రదించారని కొన్ని రోజుల ముందే వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత దీనిపై చప్పుడు లేకపోయింది.
ఒక దశలో సాయిపల్లవి ఈ సినిమాను తిరస్కరించిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్లో పవన్తో జోడీ కట్టడానికి అంగీకరించిందట. ఆమె ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేసినట్లు సమాచారం. సినిమాలో నిడివి పరంగా తక్కువే అయినప్పటికీ పాత్ర ఇంపాక్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఈ సినిమా కోసం కెరీర్లోనే అత్యధిక పారితోషకం తీసుకోనుందట సాయిపల్లవి.
విశేషం ఏంటంటే.. ప్రస్తుతం సాయిపల్లవి రానా సరసన ‘విరాటపర్వం’లో నటిస్తోంది. దీని తర్వాత రానా చేయనున్న సినిమాలో పవన్కు జోడీగా నటించనుండటం యాదృచ్ఛికమే. ఇంతకుముందు అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు తీసిన సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు రాస్తున్నట్లు చెబుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
This post was last modified on January 13, 2021 11:05 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…