ఈ రోజుల్లో పోస్టర్ల మీద వేసే కలెక్షన్ల లెక్కల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. అందుక్కారణం.. ఒరిజినల్ వసూళ్లకు, ఆ నంబర్లకు మధ్య చాలా తేడా ఉండడమే. ఆ నంబర్లు నిజం కాదని గతంలో అనుమానం ఉండేది. ఇప్పుడు నిర్మాతలే స్వయంగా ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు. కలెక్షన్ల పోస్టర్ల గురించి విలేకరులు ప్రెస్ మీట్లలో లేదా ఇంటర్వ్యూల్లో నిర్మాతల్ని అడిగితే.. నిజం మీకు తెలియదా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.
అభిమానులను సంతోషపెట్టడానికే ఈ ప్రాక్టీస్ నడుస్తున్నట్లు చెబుతారు. దిల్ రాజు, నాగవంశీ.. ఇలా పలువురు నిర్మాతలు ఈ మాట ఓపెన్గా అంటున్నారు. తాము ప్రకటించే కలెక్షన్లు నిజం కాదని అంటూనే.. ఆ ప్రాక్టీస్ను కొనసాగిస్తున్నారు. ఇటీవల లెనిన్ మూవీకి నాగవంశీ ఏం చేశాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయిన మాట వాస్తవమే అయినా.. ఒరిజినల్ కలెక్షన్లను చాలా పెంచి పోస్టర్ల మీద నంబర్స్ వేశారన్నది స్పష్టం.
ఈ నేపథ్యంలో నాగవంశీ తాజాగా మరోసారి ఫేక్ కలెక్షన్ పోస్టర్ల గురించి స్పందించాడు. ఈ ప్రాక్టీస్ను సమర్థించుకున్నాడు. తాము వంద రూపాయల కలెక్షన్ వస్తే 110-120 అని మాత్రమే చెబుతున్నాం తప్ప.. 200 అనట్లేదు కదా అని ఆయన అన్నాడు. అభిమానులను సంతోషపెట్టడానికి ఇలా కలెక్షన్లను పెంచి చూపించడం మామూలే అని, ఇందులో తప్పేముందని అడిగాడు.
మరి ఇలా పోస్టర్ల మీద భారీ నంబర్లు వేస్తే ఆదాయపు పన్ను అధికారుల నుంచి సమస్య ఉండదా అని అడిగితే.. నాగవంశీ దానికీ తనదైన శైలిలో బదులిచ్చాడు. పోస్టర్ల మీద వేసే నంబర్లు నిజం కాదని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఉండే ప్రతి అధికారికీ తెలుసని తేల్చేశాడు. ఈ నంబర్స్ విషయంలో వారికి ఫుల్ క్లారిటీ ఉందని.. ఏమైనా సందేహాలుంటే తమకు కాల్ చేసి అడుగుతారని, ఆ డేటాను తాము పంపిస్తామని, కాబట్టి వారితో తమకు సమస్యేమీ లేదని నాగవంశీ స్పష్టం చేశాడు.
This post was last modified on August 9, 2026 10:09 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…