ఆంధ్రా అందగాడు అని ఒక సినిమా. దశాబ్దంన్నర కిందట రిలీజైంది. ఐతే ఆ పేరుతో ఓ తెలుగు సినిమా ఉన్నట్లు.. అది రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. సుమన్ శెట్టి, కృష్ణభగవాన్ అందులో కీలక పాత్రలు పోషించారు. అలాంటి సినిమా తీసిన డైరెక్టర్.. ఇప్పుడు రజనీకాంత్ను కూడా వెనక్కి నెట్టి కోలీవుడ్ నంబర్ వన్ హీరోగా అవతరించిన విజయ్తో సినిమా తీయబోతున్నారు.
ఆ డైరెక్టర్ పేరు.. సుధ కొంగర. పేరు చూసి చెప్పేయొచ్చు.. ఈమె తెలుగమ్మాయి అని. ఆ సంగతి నిజమే. కాకపోతే సుధ సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంది.. ఒక స్థాయి అందుకుంది.. ఓ పెద్ద సినిమాతో తన పేరు మార్మోగేలా చేసింది కోలీవుడ్లోనే. మాధవన్, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ఆమె రూపొందించిన ‘ఇరుదు సుట్రు’ అక్కడ సెన్సేషనల్ హిట్టయింది. దీన్ని తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేసి ఇక్కడా విజయాన్నందుకుంది.
ప్రస్తుతం సూర్య హీరోగా సుధ రూపొందించిన ‘ఆకాశమే నీ హద్దురా’ విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేదేమో. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుధకు విజయ్తో సినిమా చేసే అవకాశం వచ్చిందని.. తన తర్వాతి సినిమా అతడితోనే అని ఓ ప్రచారం సాగింది. కానీ దానిపై అధికారిక సమాచారం లేదు.
కానీ ఈ రోజు సుధ పరోక్షంగా విజయ్తో తన సినిమా ఉంటుందని చెప్పేసింది. తన కొత్త సినిమా ప్రకటన జూన్ 22న ఉంటుందంటూ ఆమె ఓ ట్వీట్ వేసింది. అది విజయ్ పుట్టిన రోజు. ఆ రోజు ప్రకటన అన్నదంటే విజయ్తో తన సినిమా ఉంటుందని సుధ చెప్పకనే చెప్పిందన్నమాట.
ఐతే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే సుధతో.. మసాలా టైపు సినిమాలు చేసే విజయ్ జట్టు కట్టడానికి రెడీ అవడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. మరి కెరీర్ బిగ్గెస్ట్ ఛాన్స్ను మన తెలుగుమ్మాయి ఏ మేర ఉపయోగించుకుని.. ఎలాంటి సినిమాను డెలివర్ చేస్తుందో చూడాలి.
This post was last modified on May 5, 2020 3:49 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…