విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది వర్కింగ్ టైటిలే అయినప్పటికీ.. ఇదే ఫైనల్ అన్నట్లుగా మీడియాలో ఆ పేరునే వాడేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని చోట్లా ఒకే టైటిల్.. అది కూడా క్యాచీగా ఉండేలా పెట్టడం అవసరం. ‘ఫైటర్’ అలాంటి టైటిలే.
ఈ పేరుతోనే సినిమా ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు హిందీలో ఇదే పేరుతో వేరే సినిమా మొదలవుతుండటం విశేషం. అదేదో చిన్నా చితకా సినిమా అయితే పర్వాలేదు. కానీ హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. దీపికా పదుకొనే కథానాయికగా నటించనుంది. ఇంతకుముందు హృతిక్తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి భారీ యాక్షన్ సినిమాాలు తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 10న ‘ఫైటర్’ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారట. ‘వార్’ చిత్రాన్ని నిర్మించిన యశ్ రాజ్ ఫిలిమ్సే ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇదే సంస్థలో ప్రస్తుతం సిద్దార్థ్.. షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు సగం పూర్తయింది. ఇది పూర్తి కాగానే ‘ఫైటర్’ను మొదలుపెడతాడట సిద్దార్థ్. ఈ ఏడాదే ఈ రెండు చిత్రాలూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
‘ఫైటర్’ ఏరియల్ థ్రిల్లర్ అని.. ఇందులో హృతిక్ పైలట్ పాత్ర పోషించనున్నాడని.. బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అంటున్నారు. హృతిక్-దీపికల కాంబినేషన్ కూడా ఈ సినిమాపై అంచనాల్ని పెంచేదే. ఈ సినిమాకు ‘ఫైటర్’ టైటిల్ ఖరారైనట్లయితే.. విజయ్-పూరి సినిమాకు కొత్త టైటిల్ వెతుక్కోవాల్సిందే.
This post was last modified on January 10, 2021 10:43 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…