భారీ అంచనాలు కాదు కానీ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం మీద ఆడియన్స్ లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీని ప్రమోట్ చేసే బాధ్యత భుజాన వేసుకోవడంతో మెయిన్ సెంటర్స్ లో ఉదయం షోలు దాదాపుగా ఫుల్స్ పడ్డాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ని తీసుకురావాలనే ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. కొంత విసుర్లు కూడా వినిపించాయి.
ఇక అసలు పాయింట్ కు వస్తే శ్రీనివాస మంగాపురంకి సామాన్య ప్రేక్షకుల మద్దతు ఏ మేరకు దక్కనుందో ఈ వీకెండ్ కంతా క్లారిటీ వస్తుంది. జయకృష్ణ విషయం చూస్తే కుర్రాడు మరీ లేతగా ఉన్నప్పటికీ నటనలో ఓ మోస్తరుగా కష్టపడిన వైనం డాన్సులు, ఎక్స్ ప్రెషన్లలో కనిపించింది. అయితే భావోద్వేగాలు డిమాండ్ చేసే సీన్లతో పాటు ఇంటెన్సిటీ చూపించాల్సిన సన్నివేశాల్లో మెరుగుపడేందుకు చాలా హోమ్ వర్క్ చేయాలి. ఒక్క మూవీతో అంతా వచ్చేయదు.
హీరోల తొలి సినిమాలు దాదాపు ఇదే తరహాలోనే స్పందన తెచ్చుకుంటాయి. నాగార్జున విక్రమ్ నుంచి రామ్ చరణ్ చిరుత దాకా మిశ్రమ స్పందన సహజంగా కనిపిస్తూనే ఉంటుంది. జయకృష్ణ దానికి మినహాయింపు కాదు. అయితే దర్శకుడు అజయ్ భూపతి నుంచి ఏదైనా సిగ్నేచర్ ట్విస్టు లేదా డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఆశించిన ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో కొంత నిరాశ చెందారు. ఎందుకంటే ఆయన ఎంచుకున్నది రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీ కాబట్టి.
జయకృష్ణ నెక్స్ట్ వేయబోయే అడుగులు తనకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే సరైన ప్లానింగ్ లేకపోతే కుటుంబం బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నా నిలదొక్కుకోవడం కష్టం. తొలినాళ్ళతో సుమంత్ మంచి సక్సెస్ లు సాధించినప్పటికీ తర్వాత చేసిన పొరపాట్ల వల్ల స్టార్ కాలేకపోయాడు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి తర్వాత వచ్చేవాళ్లలో గౌతమ్ ఉన్నాడు. తన ఎంట్రీ కన్నా ముందే జయకృష్ణ సెటిలైపోతే ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటారు.
This post was last modified on July 31, 2026 10:01 am
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…