వీరాధివీరులు టైటిల్ అధికారికంగా ప్రకటించకపోయినా రవితేజ – శ్రీవిష్ణు మల్టీస్టారర్ కు ఆ పేరు దాదాపు కన్ఫర్మే. రిజిస్టర్ చేశారట కానీ ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు కాబట్టి సరైన సందర్భం చూసి అనౌన్స్ మెంట్ ఇవ్వాలని టీమ్ నిర్ణయించుకుందట. రాజరాజ చోర, స్వాగ్ లాంటి డిఫరెంట్ మూవీస్ తీసిన హసిత్ గోలి దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో, హీరోయిన్లకు సమాన ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్ సిద్దమయ్యిందని సమాచారం.
అయితే ఈ సినిమాని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ డౌటేనంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఎందుకంటే జూలై మినహాయిస్తే చేతిలో ఉన్నది కేవలం అయిదు నెలలు. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్, ప్రమోషన్స్ ఇవన్నీ దీంట్లోనే కవరైపోవాలి. అసాధ్యం కాదు కానీ ఇద్దరు హీరోలని హ్యాండిల్ చేస్తున్నప్పుడు హడావిడి చేయకూడదు. చిన్న పొరపాటు ఒక్కోసారి పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం రవితేజ కొంచెం లేట్ అయినా పర్లేదు బెస్ట్ ఇద్దామని హసిత్ గోలితో చెప్పారట. హిట్ స్టాంప్ పడాల్సిన భర్త మహాశయులకు విజ్ఞప్తి పండగకు వచ్చి మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారితో క్లాష్ అవ్వడం వల్లే అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదని, అందుకే సంక్రాంతికి మోజు పెంచుకోవడం కన్నా కొంచెం నెమ్మది అయినా సరే సోలోగా రావడమే ఉత్తమమని భావించారట. శ్రీవిష్ణు కూడా దీనికే సపోర్టని టాక్.
సో ఇప్పటికైతే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనట్టే. ఇక రవితేజ విషయానికి వస్తే ఇరుముడి చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ సమాంతరంగా చేస్తున్నారు. ఆగస్ట్ 21 విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. ఆపై వారం టాక్సిక్ ఉన్నా కూడా టీమ్ ఎలాంటి టెన్షన్ పడటం లేదట. కంటెంట్ సాలిడ్ గా ఉండటం, అయ్యప్ప ఎలిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ వగైరాలు కుటుంబ ప్రేక్షకులను తమ సినిమాకే వచ్చేలా చేస్తాయని వాళ్ళ ధీమా.
Gulte Telugu Telugu Political and Movie News Updates