Movie News

బాలయ్యకు విలన్‌గా ఐశ్వర్య రాజేష్?

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం రచ్చ గెలిచి ఇంటికి వచ్చింది. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. 80వ దశకంలో తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన దివంగత నటుడు రాజేష్ తనయురాలే ఐశ్వర్య. ఐతే సినిమాల్లో నటించేటపుడు రాజేష్ కుటుంబం చెన్నైలో స్థిరపడడం వల్ల ఐశ్వర్య అక్కడే పుట్టి పెరిగింది. నటిగా అవకాశాలు అక్కడే అందుకుని.. మంచి గుర్తింపు సంపాదించింది. తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది.

మొదట్లో అంత కలిసి రాకపోయినా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్న ఐశ్వర్య, తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటోంది. వెంకీ తర్వాత ఇప్పుడామె మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య.. దీని తర్వాత కొరటాల శివ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ.. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటించనుందట. ఐతే ఆమెది బాలయ్యకు జోడీగా నటించే హీరోయిన్ పాత్ర కాదట. ఇందులో ఆమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర అని సమాచారం.

ఐతే ఐశ్వర్యనే మెయిన్ విలన్ పాత్ర చేసే అవకాశం లేదు. ఇందులో మరో పెద్ద విలన్ ఉంటారట. మంచి నటిగా పేరున్న ఐశ్వర్యకు నెగెటివ్ రోల్ ఇస్తే చెడుగుడు ఆడేస్తుందనడంలో సందేహం లేదు. అందులోనూ బాలయ్య-కొరటాల చిత్రంలో విలన్ పాత్ర అంటే కచ్చితంగా అది చాలా స్పెషల్‌గానే ఉంటుంది. సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.

This post was last modified on July 21, 2026 2:29 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

1 hour ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

4 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

4 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

4 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

7 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

8 hours ago