Movie News

సింహాద్రి సీన్… రాజమౌళి ని అందరూ వ్యతిరేకించినా

దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం.. సింహాద్రి. ఆయనకు అది రెండో సినిమానే. కానీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా సూపర్ స్టార్ అయిపోయాడు. తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ హిట్టయినా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయిన జక్కన్న.. ‘సింహాద్రి’తో అగ్ర దర్శకుల్లో ఒకడిగా ఎదిగిపోయాడు.

ఐతే ఈ చిత్రానికి ప్రాణం అనదగ్గ ఒక సన్నివేశం విషయంలో తన టీం అంతా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రాజమౌళి తాజాగా వెల్లడించారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆయన అక్కడ ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ‘సింహాద్రి’కి సంబంధించిన కీలక సన్నివేశం గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ చిత్రంలో తారక్.. హీరోయిన్ భూమిక తండ్రి అయిన భాను చందర్‌ను కాల్చి చంపుతాడన్న సంగతి తెలిసిందే. చేతిలో బాంబు ఉన్న సూట్‌కేస్‌తో రైలు ఎక్కబోతుంటే.. ట్రైన్లో ఉన్న వేల మందిని కాపాడ్డం కోసం మంచి వాడైన భానుచందర్‌ను కాల్చి చంపేస్తాడు తారక్. ఐతే తన సినిమాల కథా చర్చలన్నీ తన కుటుంబ సభ్యులతోనే జరుగుతాయని, అందరి ఏకాభిప్రాయం మేరకు స్క్రిప్టు లాక్ చేస్తామని.. కానీ ఇక్కడ ఒక మంచి వ్యక్తిని హీరో చంపేస్తే దాన్ని ప్రేక్షకులు ఒప్పుకోరంటూ తన టీంలో అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారని రాజమౌళి తెలిపాడు.

కానీ ఇది కథకు ప్రాణం అనదగ్గ సన్నివేశం ఇదని.. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ బాగా పండుతుందని, ఎమోషన్ వర్కవుట్ అవుతుందని వాదించానని రాజమౌళి వెల్లడించాడు. ఈ సీన్ విషయంలో మిగతా అందరూ ఒక వైపు ఉంటే.. తాను మాత్రం ఇంకోవైపు ఉండి ఈ సన్నివేశాన్ని సినిమాలో పెట్టానని.. ఆ సన్నివేశానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందని రాజమౌళి గుర్తు చేసుకున్నాడు.

This post was last modified on July 21, 2026 2:04 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ క్లాసు ప్లస్ మాసు… ఒకే రోజులో

నిన్న విడుదలైన యెషనాగుల కట్ట మీద పాట సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా ఇతర స్టార్ హీరోల…

47 minutes ago

టాక్సిక్ పరిస్థితి ఎలా ఉంది గురూ

భారీ అంచనాల మధ్య కెజిఎఫ్ ని మించి ఉంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న టాక్సిక్ రిలీజ్ రోజు ఉదయం నుంచే…

2 hours ago

ఇరుముడి జోరుకు పగ్గాలు అసాధ్యం

టయర్ 1 హీరోలు, ప్యాన్ ఇండియా సినిమాలకు రోజుల తరబడి హౌస్ ఫుల్స్ పడటం సహజం. కానీ వాటికి కూడా…

3 hours ago

సీఎం రేవంత్ టీంకు ఢిల్లీ నుంచి పిలుపు

అంతా ఊహించినట్టే ఢిల్లీ కాంగ్రెస్ స్పందించింది. ఇన్నాళ్లు తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తూ వచ్చిన అధిష్టానం…

4 hours ago

వైసీపీ ప‌రిస్థితి దారుణం… పోటీకి నేతలు ఉన్నారా?

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కోరుకుంటున్నారు. త‌ద్వారా.. గ‌త 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం…

6 hours ago

వైసీపీ టాప్ లీడ‌ర్‌కు జ‌గ‌న్ చెక్‌…?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే…

7 hours ago