ఇప్పటిదాకా ఇండియన్ సినిమాల్లో అనేక రకాల హీరో ఎలివేషన్లు చూశాం. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో టాలీవుడ్ దర్శకుల శైలే వేరు. రాజమౌళి సహా చాలామంది దర్శకులు హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లినవాళ్లే. ఐతే రాజమౌళిని సైతం మించిపోయేలా ‘కేజీఎఫ్’ మూవీలో హీరోయిజాన్ని మరో స్థాయిలో చూపించి ఔరా అనిపించాడు ప్రశాంత్ నీల్. అతను ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడు అనడానికి.. యశ్ లాంటి మనకు పరిచయం లేని హీరో సినిమా చూస్తూ ఒక సూపర్ స్టార్ మూవీ చూస్తున్న భావన కలగడమే నిదర్శనం.
మామూలుగా మనకు కొత్త అయిన హీరోకు ఎక్కడ లేని ఎలివేషన్లు ఇస్తుంటే మనం కనెక్ట్ అవలేం. అదోలా అనిపిస్తుంది. కానీ ‘కేజీఎఫ్’లో మాత్రం హీరోయిజానికి మన వాళ్లే కాదు.. వివిధ భాషల వాళ్లు కనెక్టయ్యారు. చాప్టర్-1లో హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి కేజీఎఫ్లో తొలిసారి హీరో రౌడీ బ్యాచ్ మీద ఎదురు తిరిగే సన్నివేశం వరకు హీరోయిజం ఓ రేంజిలో ఎలివేట్ అయిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
ఇప్పుడు ‘కేజీఎఫ్-2’లో ఎలివేషన్ల మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండగా.. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్లో ఫైనల్ పంచ్ ఇచ్చి ఔరా అనిపించాడు ప్రశాంత్ నీల్. చివర్లో షూటింగ్, సిగరెట్ వెలిగించుకునే సీన్లు చూశాక మాస్కు పూనకాలు వచ్చేశాయి.
కన్నడలో కూడా మీడియం రేంజ్ హీరోనే అయిన యశ్ను పెట్టి ఇలా హీరోయిజం ఎలివేట్ చేసిన ప్రశాంత్.. ‘బాహుబలి’ సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగిన ప్రభాస్ను ‘సలార్’లో ఇంకెలా చూపిస్తాడో.. అందులో హీరోయిజం ఇంకెంత ఎలివేట్ అవుతుందో అని ఊహించుకుంటూ పులకించిపోతున్నారు మన అభిమానులు. దీని తర్వాత ఎన్టీఆర్తో కూడా ప్రశాంత్ జట్టు కట్టే అవకాశముండటంతో ఆ మాస్ హీరోను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అన్న ఆసక్తి కూడా కలుగుతోంది. ఐతే హీరో ఎలివేషన్ల విషయంలో తన ఐడియాలన్నీ ‘కేజీఎఫ్’ కోసమే వాడేయకుండా.. కొన్ని ప్రభాస్, తారక్ల కోసం కూడా దాచుకోవాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 8, 2021 3:34 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…