ఇప్పటిదాకా ఇండియన్ సినిమాల్లో అనేక రకాల హీరో ఎలివేషన్లు చూశాం. ముఖ్యంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో టాలీవుడ్ దర్శకుల శైలే వేరు. రాజమౌళి సహా చాలామంది దర్శకులు హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లినవాళ్లే. ఐతే రాజమౌళిని సైతం మించిపోయేలా ‘కేజీఎఫ్’ మూవీలో హీరోయిజాన్ని మరో స్థాయిలో చూపించి ఔరా అనిపించాడు ప్రశాంత్ నీల్. అతను ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడు అనడానికి.. యశ్ లాంటి మనకు పరిచయం లేని హీరో సినిమా చూస్తూ ఒక సూపర్ స్టార్ మూవీ చూస్తున్న భావన కలగడమే నిదర్శనం.
మామూలుగా మనకు కొత్త అయిన హీరోకు ఎక్కడ లేని ఎలివేషన్లు ఇస్తుంటే మనం కనెక్ట్ అవలేం. అదోలా అనిపిస్తుంది. కానీ ‘కేజీఎఫ్’లో మాత్రం హీరోయిజానికి మన వాళ్లే కాదు.. వివిధ భాషల వాళ్లు కనెక్టయ్యారు. చాప్టర్-1లో హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి కేజీఎఫ్లో తొలిసారి హీరో రౌడీ బ్యాచ్ మీద ఎదురు తిరిగే సన్నివేశం వరకు హీరోయిజం ఓ రేంజిలో ఎలివేట్ అయిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
ఇప్పుడు ‘కేజీఎఫ్-2’లో ఎలివేషన్ల మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండగా.. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్లో ఫైనల్ పంచ్ ఇచ్చి ఔరా అనిపించాడు ప్రశాంత్ నీల్. చివర్లో షూటింగ్, సిగరెట్ వెలిగించుకునే సీన్లు చూశాక మాస్కు పూనకాలు వచ్చేశాయి.
కన్నడలో కూడా మీడియం రేంజ్ హీరోనే అయిన యశ్ను పెట్టి ఇలా హీరోయిజం ఎలివేట్ చేసిన ప్రశాంత్.. ‘బాహుబలి’ సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగిన ప్రభాస్ను ‘సలార్’లో ఇంకెలా చూపిస్తాడో.. అందులో హీరోయిజం ఇంకెంత ఎలివేట్ అవుతుందో అని ఊహించుకుంటూ పులకించిపోతున్నారు మన అభిమానులు. దీని తర్వాత ఎన్టీఆర్తో కూడా ప్రశాంత్ జట్టు కట్టే అవకాశముండటంతో ఆ మాస్ హీరోను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అన్న ఆసక్తి కూడా కలుగుతోంది. ఐతే హీరో ఎలివేషన్ల విషయంలో తన ఐడియాలన్నీ ‘కేజీఎఫ్’ కోసమే వాడేయకుండా.. కొన్ని ప్రభాస్, తారక్ల కోసం కూడా దాచుకోవాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…