Movie News

చిరు తర్వాత బరిలోకి దిగిన బాలయ్య

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఓ పెద్ద గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. డ్యాన్సర్స్ అసోసియేషన్లో రెండు వర్గాలు తయారై తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నాయి. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, ఆమె భర్త జానీ మాస్టర్ ఒకవైపుంటే.. శేఖర్ సహా మిగతా మాస్టర్లంతా ఒక వైపు నిలిచినట్లు కనిపిస్తోంది.

అసోసియేషన్ ఉప ఎన్నికల విషయమై ఈ రెండు వర్గాల తీవ్ర ఘర్షణకు దిగడం.. అంతలో మెగాస్టార్ చిరంజీవి వద్దకు ఈ విషయం చేరి జానీ, శేఖర్‌లను పిలిచి మాట్లాడడంతో వ్యవహారం అంతటితో సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు.

కానీ ఆ తర్వాత కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గొడవ మరింత పెద్దదవుతుందేమో అనిపించింది. ఐతే మరో ఇప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సీరియస్ అయినట్లు కనిపిస్తోంది. సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్‌ను రంగంలోకి దించి ఈ గొడవకు వెంటనే ముగింపు పలకాలని బాలయ్య స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.

జానీ మాస్టర్ తన భార్య సుమలతతో కలిసి మరోసారి మీడియా ముందుకు వచ్చి.. ఈ సమస్య పరిష్కారమైనట్లు ప్రకటించారు. చిరంజీవి తర్వాత బాలయ్య కూడా ముందుకు వచ్చి ఈ వ్యవహారం సద్దుమణిగేలా చేశారని, ఆయనకు థ్యాంక్స్ అని జానీ చెప్పారు. మరోవైపు ప్రసన్న కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు.

ఈ వివాదం విషయంలో బాలయ్య సీరియస్ అని విషయాన్ని ఆయన వెల్లడించారు. సినిమాల ద్వారా మనం జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలే తప్ప.. ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవకూడదని బాలయ్య స్పష్టం చేశారని.. దీంతో ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని ప్రసన్న కుమార్ తెలిపాడు. మరి ఇంతటితో అయినా విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగుతాయేమో చూడాలి.

This post was last modified on July 20, 2026 5:45 pm

Share

Recent Posts

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

3 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

3 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

3 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

5 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

6 hours ago

ఆర్ఆర్ఆర్ కూడా ఇరుముడి వెనకే

ఇరుముడి సినిమాలో లీడ్ రోల్ చేసింది టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రవితేజ. ఆయన నుంచి వచ్చిన చివరి…

7 hours ago