తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగరాజు అనేే వీరాభిమాని వల్లే. అఖిల్ కెరీర్ ఆరంభంలో ఈ అభిమాని వీరావేశంతో తనను ఉద్దేశించి ‘‘అయ్యగారే నంబర్ వన్.. ఆడే రావాలి.. ఆడే కరెక్టు’’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి అదో పెద్ద మీమ్ టెంప్లేట్ అయింది.
తర్వాతి కాలంలో అఖిల్ దగ్గరికి విషయం చేరి ఆ అభిమాని గురించి ఒకట్రెండు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడాడు. అఖిల్ సినిమా వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి ఆ అభిమాని మీదికి వెళ్తుంది. ‘లెనిన్’ సినిమా రిలీజ్ టైంలో కూడా అదే జరిగింది. మీడియా వాళ్లు అతణ్ని ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. ఒక యూట్యూబర్ తన ఆర్థిక పరిస్థితిని కూడా బయటపెట్టాడు. ఈ సందర్భంగా నాగరాజు కల్మషం లేని అభిమానం గురించి అక్కినేని వారికి బాగానే తెలిసినట్లుంది.
తాజాగా ‘లెనిన్’ సినిమా సక్సెస్ ఈవెంట్ను నాగరాజు సొంత ప్రాంతమైన గుంటూరులోనే చేశారు. ఆ సందర్భంగా నాగరాజుకు అఖిల్ను కలిసే అవకాశం కల్పించారు అభిమానులు. కారవాన్లో అఖిల్ను కలిసిన వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ సందర్భంగా నాగరాజు ఉద్వేగం మామూలుగా లేదు. అఖిల్ కాళ్ల మీద పడిపోయి బోరున ఏడ్చేశారు. తన అభిమానాన్ని మాటల్లో చేతల్లో చూపించేశాడు నాగరాజు.
అతణ్ని ఓదారుస్తూ అఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది అని చెప్పాడు. తర్వాత తన భార్యను పరిచయం చేశాడు కూడా. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో అఖిల్ భార్యను ఈ సినిమా ఫలితం గురించి అడిగితే ‘అయ్యగారే నంబర్ వన్’ అంటూ ఆ వీరాభిమాని మాటనే వల్లె వేయడం విశేషం.
This post was last modified on July 16, 2026 8:48 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…