ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం గురించి ఒక హెచ్చరిక చేశారు. ఇప్పటికే వాడకం రకరకాలుగా సామాన్యుల్లోనూ పెరిగిపోయిన నేపథ్యంలో వీటి తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఊహకు అందటం లేదు. సెలబ్రిటీలు కోర్టుకు వెళ్లి రక్షణ తెచ్చుకున్నా సరే అంత సులభంగా ఇవి ఆగేలా లేవు. దానికి తాజా ఉదాహరణగా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో.
కొందరు నెటిజెన్లు తమ క్రియేటివిటీ వాడి రామాయణం శాంపిల్ ని టాలీవుడ్ స్టార్స్ తో సృష్టించారు. రాముడిగా మహేష్ బాబు, సీతగా కీర్తి సురేష్, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్, మండోదరిగా జాన్వీ కపూర్, లక్ష్మణుడిగా నాని పాత్రలను ఏ మాత్రం పోలికలు మిస్ కాకుండా పర్ఫెక్ట్ గా చేశారు. సీతను లంకలో బందీని చేసినప్పుడు వచ్చే ఘట్టాన్ని శాంపిల్ గా చేశారు. యానిమేషన్ లుక్స్ స్పష్టంగా ఉన్నాయి కానీ ఈ మాత్రం అవుట్ ఫుట్ ఇవ్వడం చిన్న విషయం కాదు.
ఇది ఎందుకు ఆలోచించాలంటే ఏఐ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పుడే ఇంత సృజనాత్మకత బయటికి వస్తే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండబోతోందో ఊహించుకోవడం కష్టం. ఇవి క్రమంగా ఎక్కువైతే ఒరిజినాలిటీని కూడా అనుమానించే పరిస్థితి తలెత్తుతుంది. ఉదాహరణకు విశ్వంభర, రామాయణ టీజర్లకు నెగటివ్ రెస్పాన్స్ కనిపించడానికి కారణం ముమ్మాటికీ ఏఐనే. డ్రాగన్ విజువల్స్ మీద కూడా కామెంట్స్ వచ్చిన ఉదంతాన్ని మర్చిపోకూడదు.
కోర్టుకు వెళ్లి ప్రొటెక్షన్ తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు. క్వాలిటీ మీద మరింత దృష్టి పెట్టాలి. ఇలాంటి రామాయణ తరహా వీడియోలు ఎవరు చేసినా వీలైనంత త్వరగా వాటిని లీగల్ గా ఆపించేయాలి. లేదంటే అసలు సినిమాలకు సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఏఐ కంపెనీలు నువ్వా నేనాని పోటీ పడుతూ సరికొత్త పోకడలు తీసుకొస్తున్నాయి. అది కూడా తక్కువ ఖర్చుతో. వీళ్ళ సంగతేమో కానీ బాలీవుడ్ లో ఆర్టిస్టులు లేకుండా కేవలం ఎఐతో మూడు పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మొదట 80వ…
నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్…
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…