Trends

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు… అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ఒక మహిళ దుశ్చర్యకు పాల్పడింది. ఏకంగా న్యాయమూర్తి కుర్చీపైనే చేతబడికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో కలకలం రేపింది. జడ్జి లేని సమయంలో కోర్టులోకి ప్రవేశించిన మహిళ, తెల్ల ఆవాలను జడ్జి కుర్చీపై చల్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

65 ఏళ్ల మంజుల అనే మహిళ 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి-జేఎంఎఫ్‌సీ కోర్టులోకి వెళ్లి ఈ చర్యకు పాల్పడింది. ఆమెపై నడుస్తున్న సివిల్ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా మహిళ జడ్జి కుర్చీ వద్ద ఆవాలు చల్లడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

ఈ సంఘటనతో కోర్టు భద్రత అంశం కూడా చర్చకు వచ్చింది. న్యాయమూర్తి కుర్చీ వరకు ఓ వ్యక్తి చేరుకుని ఇటువంటి చర్య చేయగలిగారంటే భద్రతా వ్యవస్థలో లోపాలున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. కోర్టు ప్రాంగణాల్లో నిఘా, ప్రవేశ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. 

Kumar

Recent Posts

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

48 seconds ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

3 minutes ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

34 minutes ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

44 minutes ago

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…

48 minutes ago

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…

2 hours ago