న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు… అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ఒక మహిళ దుశ్చర్యకు పాల్పడింది. ఏకంగా న్యాయమూర్తి కుర్చీపైనే చేతబడికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో కలకలం రేపింది. జడ్జి లేని సమయంలో కోర్టులోకి ప్రవేశించిన మహిళ, తెల్ల ఆవాలను జడ్జి కుర్చీపై చల్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
65 ఏళ్ల మంజుల అనే మహిళ 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి-జేఎంఎఫ్సీ కోర్టులోకి వెళ్లి ఈ చర్యకు పాల్పడింది. ఆమెపై నడుస్తున్న సివిల్ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా మహిళ జడ్జి కుర్చీ వద్ద ఆవాలు చల్లడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఈ సంఘటనతో కోర్టు భద్రత అంశం కూడా చర్చకు వచ్చింది. న్యాయమూర్తి కుర్చీ వరకు ఓ వ్యక్తి చేరుకుని ఇటువంటి చర్య చేయగలిగారంటే భద్రతా వ్యవస్థలో లోపాలున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. కోర్టు ప్రాంగణాల్లో నిఘా, ప్రవేశ నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
This post was last modified on July 14, 2026 11:41 pm
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…
టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…
ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య రిలీజ్ డేట్ వేసుకోవడం. ఒకవేళ మంచి తేదీ దొరికినా దానికి కట్టుబడి…