ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి కథనాలు అల్లుతున్న వైనం గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రతరం అవుతున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్లాయంటే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ( తారక్ ) టీమ్ నుంచి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇటీవలే విజయ్ మొదటి విడతలోనే సిఎం అయిపోయాక ఇలాంటి ప్రచారాలు మన దగ్గర ఊపందుకున్నాయి. కొందరు అల్లు అర్జున్ పేరుని కూడా తెరపైకి తెచ్చారు.
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా లక్ష్యాలు చాలా ఉన్నాయి. తన మార్కెట్ పరిధిని పెంచుకునే ఉద్దేశంతో ప్రాజెక్టులు లేట్ అవుతున్నా ఓపికగా భరిస్తున్నాడు. లేదంటే డ్రాగన్ కి ఇచ్చిన టైంలో ఈజీగా రెండు ప్యాన్ ఇండియా మూవీస్ చేయొచ్చు. కానీ తన ఆలోచన అది కాదు. కర్ణాటక తప్ప బయట పెద్దగా పరిచయం లేని యష్ తోనే కెజిఎఫ్ అంత గుర్తింపు తెచ్చినప్పుడు తారక్ లాంటి సీనియర్ కనక ప్రశాంత్ నీల్ తో చేయి కలిపితే ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చోననే ప్లానింగే దీనికి ప్రేరేపించింది.
టెంపర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన టార్గెట్స్ పట్ల స్పష్టంగా ఉన్నాడు. ఏదో బాలీవుడ్ లో జెండా పాతుదామని తొందరపడి చేసిన వార్ 2 డిజాస్టర్ తప్ప టెంపర్ తర్వాత ఒక్క ఫ్లాప్ లేకపోవడాన్ని ఇక్కడ గమనించాలి. ఇంత జాగ్రత్తే దేవర 2 విషయంలో ముందడుగు వేయకుండా ఆపుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాంటసీ మూవీని ఒప్పుకునేలా చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ తో భవిష్యత్తులో కమిట్ మెంట్ సజీవంగా ఉంచుకునేలా చేసింది.
నాలుగు పదుల వయసు దాటిన జూనియర్ ఎన్టీఆర్ కు ఏ కోశానా ఇప్పటికిప్పుడు పొలిటికల్ ఎంట్రీ చేసే ఉద్దేశం లేదు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ సంపూర్ణంగా కెరీర్ ఉచ్ఛస్థితిని చూశాక రాజకీయాలకు వచ్చారు. బాలయ్య తన పరిధిని పరిమితంగా ఉంచుకున్నాడు. తెలుగుదేశం ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంది. ఈ టైంలో ఇలాంటి వాటి గురించి ఆలోచించడం సబబు కాదు. తారక్ చేస్తోంది అదే. కానీ సోషల్ మీడియాలో చిన్న పుల్లతో పెద్ద అగ్గి రగిల్చినట్టు ఈ ఉత్తుత్తి ప్రచారాలే చాలా దూరం వెళ్తున్నాయి.
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…